టీఎస్ అగ్రిసెట్-2022 ఫలితాలను ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అక్టోబర్ 22న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను యూనివర్సిటీ రూపొందించింది. అగ్రిసెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.


ఫలితాలతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను (సమాధాన పత్రాలు) కూడా యూనివర్సి విడుదల చేసింది. ఫలితాల్లో వ్యవసాయ డిప్లొమాలో 940 మంది, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీలో 95 మంది, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్‌లో 62 మంది, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణులు 47 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా వ్యవసాయ డిగ్రీ కోర్సులో సీట్లు కేటాయిస్తారు. ఈ పరీక్షను రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో సెప్టెంబర్ 30న నిర్వహించారు.




AGRICET & AGRIENGGCET-2022 RESULTS:







1. AGRICET - 2022 (Agriculture) - Merit List


2. AGRICET - 2022 (Seed Technology) - Merit list


3. AGRICET - 2022 (Organic Agriculture) - Merit list


4. AGRIENGGCET - 2022 (Agricultural Engineering) - Merit List


5. Click here to download - RESPONSE SHEET


Official Website Website


 


ఉన్నత విద్య పరీక్షల విధానంలో మార్పు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో ఎంవోయూ!
రాష్ట్రంలో ఉన్నత విద్య పరీక్ష విధానంలో గుణాత్మక మార్పులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)తో రాష్ట్ర ఉన్నత విద్యామండలి, కమిషరేట్‌ ఆఫ్‌ కాలేజీయేట్‌ ఎడ్యుకేషన్‌ అక్టోబరు 21న ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విద్యార్థి నైపుణ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించే పరీక్ష విధానం భవిష్యత్‌లో అతనికి గుర్తింపునిచ్చేదిగా, ఉపాధికి బాటలు వేసే విధంగా ఉండాలన్నదే ఈ ఎంవోయు లక్ష్యమని ఉన్నత విద్య మండలి పేర్కొంది.

ఇప్పుడున్న పరీక్షల విధానంలో తీసుకురావాల్సి మార్పులపై ఐఎస్‌బీ అధ్యయనం చేసి, ఆరు నెలల్లో నివేదిక ఇవ్వనుంది. విద్యార్థి నైపుణ్యాన్ని అంచనా వేయడానికి అవసరమైన పరీక్షలు ఎలా ఉండాలనేది క్షేత్రస్థాయి అధ్యయనం ద్వారా తెలుసుకోబోతున్నారు. అంతర్గత పరీక్షలతో సహా కాలేజీ విద్యలో జరిగే అన్ని పరీక్షల విధానాలను పరిశీలించి, సరికొత్త ఫ్రేమ్‌వర్క్‌తో కొన్ని సిఫార్సులు చేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా విద్యార్థి నైపుణ్యాన్ని ఎలా అంచనా వేయాలనేది సూచిస్తుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలేజీయేట్‌ విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ.. నూతన ఆలోచన విధానం, భవిష్యత్‌ మార్పుల విషయంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని, తాజా ఎంవోయు ఇందుకు నిదర్శనం అని అన్నారు. విద్యావిధానంలో విద్యార్థి నైపుణ్యతను సరికొత్తగా వెలికి తీసేందుకు అధ్యయనం తోడ్పడుతుందని ఆయన తెలిపారు. 

ఉన్నత విద్యామండలి ఛైర్మన ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి మాట్లాడుతూ.. ప్రస్తుత పరీక్ష, మూల్యాంకన విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థి కూడా ఉపాధి విషయంలో సవాళ్ళు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల్లోని లోతైన ఆలోచన విధానాన్ని, సమస్యలు పరిష్కరించే సామర్థ్యా‍న్ని అంచనా వేయాలని భావిస్తున్నామని, కానీ ప్రస్తుతం ఉన్న పరీక్ష విధానంలో వారి జ్ఞాపకశక్తిని మాత్రమే అంచనా వేస్తున్నామని తెలిపారు. ఐఎస్‌బీ దీనిపై సమగ్ర అధ్యయనం చేసి, సరైన మూల్యాంకన విధానం, బోధన ప్రణాళిక తీరు, టీచింగ్‌ మెథడ్స్‌లో తీసుకురావాల్సిన మార్పులను సూచిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..