దేశంలో విదేశీ యూనివర్సిటీలు విద్యా సంస్థలు నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సమయంలో విదేశీ విద్యాసంస్థలు అందించే డిగ్రీ సహా పలు కోర్సుల గుర్తింపునకు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆగస్టు 17న విడుదల చేసింది. ఆయా దేశాల్లో గుర్తింపు పొందిన విదేశీ విద్యా సంస్థలు జారీ చేసే డిగ్రీలకే భారత్‌లో సమానత్వ గుర్తింపు లభిస్తుందని తెలిపింది. ఈమేరకు ముసాయిదాని యూజీసీ సిద్ధం చేసింది. ‘విదేశీ వర్సిటీలు జారీచేసే సర్టిఫికెట్స్‌కు ఆ దేశంలో ఉన్నత విద్యాసంస్థ గుర్తింపు కలిగి ఉండాలి. రెగ్యులర్‌ పద్ధతిలో కోర్సు చదివి ఉండాలి. ఆన్‌లైన్‌, డిస్టెన్స్‌ పద్ధతిలో ఉండరాదు’అని యూజీసీ పేర్కొంది.


విదేశీ యూనివ‌ర్సిటీలు ఒక‌వేళ ఇండియాలో త‌మ క్యాంప‌స్‌ల‌ను ఏర్పాటు చేయాలనుకుంటే, అప్పుడు ఆ వ‌ర్సిటీలు క‌చ్చితంగా యూజీసీ నుంచి అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంద‌ని యూజీసీ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. విదేశీ వ‌ర్సిటీల‌కు తొలుత ప‌దేళ్ల కోసం ప్రాథ‌మిక అనుమ‌తి ఇవ్వనున్నట్లు తెలిపింది. క్యాంప‌స్‌ల‌ను ఏర్పాటు చేసే విదేశీ వ‌ర్సిటీలు ఫుల్ టైమ్ కోర్సుల‌కు శిక్షణా త‌ర‌గ‌తుల‌ను భౌతికంగా నిర్వహించాల్సి ఉంటుంద‌ని, ఆన్‌లైన్ లేదా డిస్టాన్స్ లెర్నింగ్ విధానం ఉండ‌ద‌ని స్పష్టం చేసింది. అయితే ఆ వ‌ర్సిటీలు త‌మ‌కు న‌చ్చిన రీతిలో అడ్మిష‌న్, ఫీజు విధానాన్ని రూపొందించుకోవ‌చ్చు అన్నారు. విదేశీ వ‌ర్సిటీల‌కు చెందిన ముసాయిదా మార్గద‌ర్శకాల‌ను విడుదల చేసింది. ఫెమా చ‌ట్టం ప్రకారం వ‌ర్సిటీల‌కు నిధుల మ‌ళ్లింపు ఉంటుంద‌న్నారు.


ALSO READ:


నెహ్రూ గ్రామ భారతి వర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
నెహ్రూ గ్రామ భారతి(డీమ్డ్ టు బి యూనివర్సిటీ) 2023-24 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంబైన్డ్ రీసెర్చ్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 24వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


'గేట్‌-2024' షెడ్యూలు వచ్చేసింది, ఆగస్టు 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఈసారి కొత్త పేపరు జోడింపు!
దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2024) దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 24 నుంచి ప్రారంభంకానుంది. ఈసారి గేట్ నిర్వహణ బాధ్యతను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌(ఐఐఎస్‌సీ) చేపట్టింది. 'గేట్‌'లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!
డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జులై సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు అక్టోబరు 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి డిసెంబరు 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..