Telangana Inter Results 2022: తెలంగాణ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలపై అప్ డేట్ వచ్చింది. జూన్ 25న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ తెలిపారు. దాంతో మరో మూడు రోజుల్లో తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయని తెలుస్తోంది.


9 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్..  
రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మే 24న పూర్తయ్యాయి. దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు బోర్డ్ ఎగ్జామ్స్ రాశారు. మొదటగా ఈ ఫలితాలను జూన్ 20 లోగా విడుదల చేయాలని ఏపీ ఇంటర్ బోర్డ్ భావించినట్లు కార్యదర్శి జలీల్ గతంలోనే మీడియాకు తెలిపారు. జవాబు పత్రాల మూల్యంకనం కొన్ని రోజుల కిందట పూర్తయింది. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకుని ఫలితాలు విడుదల చేయాలని రాష్ట్ర ఇంటర్ బోర్డ్ భావించింది. జూన్ 25న ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని, బోర్డ్ అందుకు తగిన ఏర్పాటు చేసింది. ఫలితాలు విడుదలయ్యాక కేవలం 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. తద్వారా ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు.


తెలంగాణలో టెన్త్  రిజల్ట్స్ కోసం ఎదురుచూపులు
TS 10th Exam Results: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మే 28న జరిగిన సాంఘిక పరీక్షతో పరీక్షలు ముగిశాయి. చివరి రోజు పరీక్షకు మొత్తం 5,03,114 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులకు జూన్‌ 1 వ తేదీన చివరి పరీక్ష జరగనుంది. ఆ మరుసటి రోజు నుంచి అంటే జూన్‌ 2 నుంచి తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ ప్రారంభిస్తారు. జూన్‌ 30 లోపు టెన్త్ రిజల్ట్స్ ప్రకటించాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది. 


తెలంగాణలో మే 23న ప్రారంభమైన టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ శనివారం నాడు ముగిశాయి. గత ఏడాది వరకు పదో తరగతి పరీక్షల్లో 11 పేపర్ల పరీక్షలు ఉండేవి. కరోనా వ్యాప్తి తరువాత పరీక్షల నిర్వహణ సాధ్యం అవకపోవడంతో రెండేళ్లు నేరుగా విద్యార్థులను తరువాతి తరగతులకు ప్రమోట్ చేశారు. ఈ ఏడాది పదకొండు పేపర్లకు బదులుగా 6 పేపర్లకు పరిమితం చేయడంతో ఒకే వారంలో పరీక్షలు పూర్తయ్యాయి. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ను పెంచేశారు. ఈ ఏడాది  5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 99 శాతం మంది) పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 2,861 కేంద్రాలను ఏర్పాటు చేయగా 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 99 శాతం మంది హాజరయ్యారు. సాధ్యమైనంత త్వరగా స్పాట్ వ్యాల్యుయేషన్ పూర్తి చేసి వచ్చే నెలాఖరులోగా ఫలితాలు విడుదల చేయనున్నారు.