Raju Sangani Visionary Education Leader of the Year: ది మాస్టర్ మైండ్స్ స్కూల్స్, ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్స్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్   ఛైర్మన్   రాజు సంగని  విద్యారంగంలో తన విశిష్టమైన కెరీర్ లో మరో ఘనత సాధించారు.

Continues below advertisement

విద్యారంగం,   విద్యా నైపుణ్యానికి ఆయన  రాజు సంగని చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా ఇటీవల ఆయనకు ప్రతిష్టాత్మకమైన "విజనరీ ఎడ్యుకేషన్ లీడర్ ఆఫ్ ది ఇయర్" అవార్డుతో సత్కరించారు.  అలాగే  USA లోని మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ గణితంలో డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

గణిత ఉపాధ్యాయుడిగా 40 సంవత్సరాల స్ఫూర్తిదాయకమైన ప్రయాణం సంగని సొంతం. ఆయన  తన వినూత్న బోధనా పద్ధతులు , సమగ్ర అభ్యాసానికి నిబద్ధత ద్వారా వేలాది మంది  భావితరాన్ని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దారు.  ఆయన డైనమిక్ నాయకత్వంలో, ఆయన సంస్థలు విద్యా నైపుణ్యం, విలువ ఆధారిత విద్యకు చిహ్నాలుగా మారాయి.

Continues below advertisement

ఈ అత్యుత్తమ విజయాలను గుర్తిస్తూ, తెలంగాణ గౌరవనీయ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ,  సంగనిని అభినందించారు.   వ్యక్తిగతంగా విద్య భవిష్యత్తును రూపొందించడంలో ఆయన చేసిన అద్భుతమైన సేవ, నాయకత్వాన్ని ప్రశంసించారు.

ఈ గుర్తింపు రాజు సంగని జీవితాంతం అంకితభావం, దార్శనిక దృక్పథం , భారతదేశంలో విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి అవిశ్రాంత కృషికి నిదర్శనంగా నిలుస్తుందని విద్యా వర్గాలు చెబుతున్నాయి.