CPGET 2024  Application: తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌)-2024’ నోటిఫికేషన్‌ మే 15న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీపీగెట్‌ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకే అప్పగించారు. సీపీగెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 18న ప్రారంభమైంది. విద్యార్థుల నుంచి జూన్ 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే అభ్యర్థులు రూ.500 ఆలస్యరుసుముతో జూన్ 25 వరకు, రూ.2000 ఆలస్యరుసుముతో జూన్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. జులై 5 నుంచి సీపీగెట్ ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఒకటికి మించి సబ్జెక్టులకు దరఖాస్తుకునే అన్ని కేటగిరీలవారు అదనంగా రూ.450 చెల్లించాల్సి ఉంటుంది.


సీపీగెట్ పరిధిలోని 294 కళాశాలల ద్వారా మొత్తం 51 పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో 47 పీజీ కోర్సులు, 5 ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీతోపాటు.. కాక‌తీయ‌ యూనివర్సిటీ, పాల‌మూరు యూనివర్సిటీ, మ‌హాత్మాగాంధీ యూనివర్సిటీ, శాతవాహ‌న‌ యూనివర్సిటీ, తెలంగాణ‌ యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ, తెలంగాణ మ‌హిళా వ‌ర్సిటీలు సీపీగెట్ పరీక్ష ఆధారంగా క్యాంపస్, అనుబంధ కళాశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తే సూపర్‌ న్యూమరరీ పోస్టులు క్రియేట్‌ చేస్తారు. ఆన్‌లైన్, డిస్టెన్స్‌ మోడ్‌లోనూ వర్సిటీ నుంచి పీజీ కోర్సులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. పీజీ సెట్‌ రాయాలనుకునే వారు తాజాగా తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి. కుల ధ్రువీకరణ, ఇతర సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి. 


వివరాలు..


* సీపీగెట్ - 2024


ప్రవేశాలు కల్పించే కోర్సులు..


➥ ఎంఏ


➥ ఎంఎల్ఐఎస్సీ


➥ ఎంఎస్‌డబ్ల్యూ


➥ ఎంహెచ్ఆర్‌ఎం


➥ ఎంటీఎం


➥ ఎంకామ్


➥ ఎంఈడీ


➥ ఎంపీఈడీ


➥ ఎంఎస్సీ


➥ ఎంబీఏ (5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్)


ప్రవేశం కల్పించే యూనివర్సిటీలు: ఉస్మానియా, కాక‌తీయ‌, పాల‌మూరు, మ‌హాత్మాగాంధీ, శాతవాహ‌న‌, తెలంగాణ‌, జేఎన్టీయూహెచ్, తెలంగాణ మ‌హిళా వ‌ర్సిటీలు సీపీగెట్ పరీక్ష ఆధారంగా క్యాంపస్, అనుబంధ కళాశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి.


అర్హత: డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఎంబీబీఎస్, బీటెక్‌ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్‌ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్‌ కోర్సులకు ఏ గ్రూపుతో డిగ్రీ చేసినా అర్హులే.


రిజిస్ట్రేషన్ ఫీజు: అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఒకటికి మించి సబ్జెక్టులకు దరఖాస్తుకునే అన్ని కేటగిరీలవారు అదనంగా రూ.450 చెల్లించాల్సి ఉంటుంది.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.


పరీక్ష విధానం: ప్రశ్నపత్రంలో 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్ అండ్ మైక్రోబయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ పార్ట్ ఎలో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్ బిలో ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీల్లోని ఆప్షనల్ సబ్జెక్టు (బీఎస్సీలో చదివిన) నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. బయోటెక్నాలజీ పేపర్‌లో పార్ట్ ఎ (కెమిస్ట్రీ)లో 40 ప్రశ్నలు, పార్ట్-బి (బయోటెక్నాలజీ)లో 60 ప్రశ్నలు అడుగుతారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.05.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.06.2024.


➥ రూ.500 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.06.2024.


➥ రూ.2000 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.06.2024.


➥ సీపీగెట్-2024 పరీక్షలు ప్రారంభం: 05.07.2024 నుంచి.


Notification


Information Brochure


Application Fee Payment


Check Application Fee Payment Status


Fill Application Form


Print Application Form


dditional Subjects Fee Payment


Website


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...