హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) 2023 విద్యా సంవత్సరానికి బీఎస్సీ(అలైడ్ హెల్త్ సైన్సెస్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ కోర్సులకు ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) లేదా బ్రిడ్జ్ కోర్సు ఇంటర్మీడియట్(బయాలజీ, ఫిజికల్ సైన్స్‌) ఉత్తీర్ణతతో పాటు టీఎస్‌ ఎంసెట్‌-2023లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  


కోర్సు వివరాలు.. 


* బీఎస్సీ (అలైడ్ హెల్త్ సైన్సెస్) కోర్సు


మొత్తం ఖాళీలు: 100 సీట్లు


⏩ బీఎస్సీ(అనస్తీషియా టెక్నాలజీ): 10


⏩ బీఎస్సీ(డయాలసిస్ థెరపీ టెక్నాలజీ): 20


⏩ బీఎస్సీ(కార్డియోవాస్కులర్ టెక్నాలజీ): 12


⏩ బీఎస్సీ(ఎమర్జెన్సీ అండ్‌ ట్రామా కేర్ టెక్నాలజీ): 08


⏩ బీఎస్సీ(రేడియోగ్రఫీ అండ్‌ ఇమేజింగ్ టెక్నాలజీ): 10


⏩ బీఎస్సీ(మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ): 12


⏩ బీఎస్సీ(న్యూరో టెక్నాలజీ): 06


⏩ బీఎస్సీ(పెర్ఫ్యూజన్ టెక్నాలజీ): 04


⏩ బీఎస్సీ(రేడియేషన్ థెరపీ టెక్నాలజీ): 04


⏩ బీఎస్సీ(రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ): 10


⏩ బీఎస్సీ(ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్): 04


కోర్సు వ్యవధి: నాలుగున్నర సంవత్సరాలు(ఇంటర్న్‌షిప్‌తో సహా).


అర్హత: ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) లేదా బ్రిడ్జ్ కోర్సు ఇంటర్మీడియట్(బయాలజీ, ఫిజికల్ సైన్స్‌) ఉత్తీర్ణతతో పాటు టీఎస్‌ ఎంసెట్‌-2023లో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి.


వయోపరిమితి: అభ్యర్థులకు ప్రవేశ విద్యా సంవత్సరం డిసెంబర్ 31వ తేదీకి పదిహేడేళ్లు నిండి ఉండాలి.


దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.2,500; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.2,000.


దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలి.


ఎంపిక విధానం: టీఎస్‌ ఎంసెట్‌-2023లో పొందిన ర్యాంకు ఆధారంగా ఎంపిక ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.06.2023.


➥ అప్లికేషన్ హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ: 03.07.2023.


➥ ప్రొవిజనల్‌ మెరిట్ జాబితా వెల్లడి: 18.08.2023.


➥ తుది మెరిట్ జాబితా వెల్లడి: 23.08.2023.


➥ మొదటి దశ కౌన్సెలింగ్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా వెల్లడి: 23.08.2023.


➥ మొదటి దశ కౌన్సెలింగ్‌కు అర్హత సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ లెటర్ల జారీ: 28.08.2023.


➥ మొదటి దశ కౌన్సెలింగ్ తేదీ: 02.09.2023.


Notification 


Website


Also Read:


ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
తెలంగాణలో జూన్ 12 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 4,12,325 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం నుంచి 2,70,583 మంది,  ద్వితీయ సంవత్సరం నుంచి 1,41,742 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌‌లో అందుబాటులో ఉంచారు. ఇంటర్‌ జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ పదోతరగతి హాల్‌టికెట్ నెంబర్ లేదా పాత హాల్‌టికెట్ నెంబర్ లేదా రూల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ పొందవచ్చు. హాల్‌టికెట్లలో ఏమైనా తప్పులుంటే సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ల దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవచ్చు. 
ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలు జూన్ 7న విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 18న వెలువడనున్నాయి. ఫలితాలు విడుదలైన మరుసటిరోజు నుంచే అంటే.. జూన్ 19 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జోసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి 29 వరకు కొనసాగనుంది.
కౌన్సెలింగ్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో గతేడాది మొదటి స్థానంలో నిలిచిన ఐఐటీ-మద్రాస్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023 ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్ తర్వాత రెండో స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు నిలవగా, 3వ స్థానంలో ఐఐటీ-ఢిల్లీ నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యాసంస్థల్లో ఐఐటీ-హైదరాబాద్ 14వ స్థానంలో నిలవగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 20వ స్థానంలో నిలిచింది. వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) 53వ స్థానంలో, ఉస్మానియా యూనివర్సిటీ 64వ స్థానంలో నిలిచింది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాసు అగ్రస్థానంలో నిలవడం ఇది ఐదోసారి కావడం విశేషం.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..