జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ 2023 మూడో రౌండ్ ఫలితాలు జులై 13న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో సీట్ల కేటాయింపు ఫలితాలను అందుబాటులో ఉంచారు. మూడో రౌండ్ కౌన్సెలింగ్‌లో జేఈఈ ర్యాంకు వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో సీటు కేటాయింపు చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ జేఈఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు ఇతర విద్యా సంస్థల్లో బీటెక్‌ సీట్లు జోసా కౌన్సెలింగ్‌తో భర్తీ చేస్తారు. మూడో రౌండ్ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన అభ్యర్థులు సీట్ ప్రాసెసింగ్ ఫీజును జమ చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.


ఫలితాల కోసం క్లిక్ చేయండి..


దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్, బ్యాచ్‌లర్ ఆఫ్ సైన్స్(బీఎస్సీ), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ తొలి విడత సీట్ల కేటాయింపును జూన్ 30న, జులై 6న రెండో విడత సీట్లను కేటాయించగా.. తాజాగా మూడోవిడత సీట్ల కేటాయింపు జరిపారు. ఈ రౌండ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక జులై 16న నాలుగో విడత, జులై 21న 5వ విడత, జులై 26న చివరి విడత సీట్లను కేటాయించున్నారు.


JoSAA Counselling ఇలా..


♦ 1వ రౌండ్‌ : జూన్ 30 నుంచి జులై 5 వరకు


♦ 2వ రౌండ్‌: జులై 6 నుంచి జులై 11 వరకు


♦ 3వ రౌండ్‌: జులై 12 నుంచి జులై 15 వరకు


♦ 4వ రౌండ్‌: జులై 16 నుంచి జులై 20 వరకు


♦ 5వ రౌండ్‌: జులై 21 నుంచి జులై 25 వరకు


♦ 6వ రౌండ్‌ (చివరి): జులై 26 నుంచి  జులై 28 వరకు నిర్వహిస్తారు. 
 
6 రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు ఇవే:


♦ 1వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: జూన్ 30న


♦ 2వ రౌండ్‌: జులై 6న


♦ 3వ రౌండ్‌: జులై 12న


♦ 4వ రౌండ్‌: జులై 16న


♦ 5వ రౌండ్‌: జులై 21న


♦ 6వ రౌండ్‌ (చివరి): జులై 26న


జోసా 2023-కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


 ALSO READ:


ర్జీయూకేటీ ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల, కౌన్సెలింగ్ ఎప్పుడంటే?
ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్‌ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను గురువారం (జులై 13) విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచారు. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళంలోని ఒక్కో ట్రిపుల్‌ ఐటీలో 1000 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. జులై 20 నుంచి 25 వరకు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..


APSAHPC: ఏపీ వైద్య కళాశాలల్లో పారామెడికల్ డిప్లొమా కోర్సులు, వివరాలు ఇలా!
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్(ఏపీఎస్ఏహెచ్‌పీసీ) 2023-2024 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటు పారామెడికల్‌ కళాశాలల్లో అందుబాటులో ఉన్న వివిధ పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. రెండేళ్ల కాలపరిమితితో అందిస్తున్న ఈ కోర్సులకు ఇంటర్మీడియట్‌ బైపీసీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జులై 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial