ఈ ఏడాది జూన్‌‌లో నిర్వహించిన సీఐ ఫౌండేషన్ పరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆగస్టు 10న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఐసీఏఐ మే నెలలో నిర్వహించిన సీఏ ఫైనల్ ఫలితాలను జులై 15న, సీఏ ఇంటర్ ఫలితాలను జులై 21న వెల్లడించిన సంగతి తెలిసిందే. అదే విధంగా జూన్ నెలలో నిర్వహించిన సీఏ ఫౌండేషన్ పరీక్షల ఫలితాలను ఆగస్టు 10న విడుదల చేసింది. అభ్యర్థులు తమ రూల్ నెంబర్, పిన్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలు సమర్పించి ఫలితాలు చూసుకోవచ్చు.


25.28 శాతం ఉత్తీర్ణత..
ఫలితాల్లో కేవలం 25.28 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలకు మొత్తం 93,729 మంది హాజరుకాగా.. అందులో 51111 పురుషులు, 42618 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.  పరీక్షల్లో మొత్తం 23,693 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 13043 పురుషులు, 10650 మహిళా అభ్యర్థులు ఉన్నారు. 


ఫలితాల కోసం వెబ్‌సైట్: https://icai.nic.in/caresult/

పరీక్ష విధానం..
సీఏ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది ఐసీఏఐలో ఎంట్రీ లెవల్ కోర్సుగా పరిగణిస్తారు. ఇందులో ప్రధానంగా నాలుగు పేపర్లు ఉంటాయి. అవి ప్రిన్సిపల్స్ & ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్, బిజినెస్ లా & బిజినెస్ కరెస్పాండెన్స్ & రిపోర్టింగ్, బిజినెస్ మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్ & స్టాటిస్టిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ & బిజినెస్ & కమర్షియల్ నాలెడ్జ్. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే, ప్రతి పేపరులో కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. మొత్తంగా 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.



Also Read:


హైదరాబాద్ విద్యార్థికి బంపర్ ఆఫర్, ఏకంగా రూ.1.30కోట్ల స్కాలర్‌షిప్!!


బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ!


 


కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023


దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్) - 2023' ప్రవేశ ప్రక‌ట‌న విడుదలైంది. దీనిద్వారా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీతోపాటు, ఏడాది కాలపరిమితి ఉండే పీజీ (ఎల్‌ఎల్‌ఎం) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. డిగ్రీ కోర్సుకు ఇంటర్, పీజీ కోర్సులో ప్రవేశానికి లా డిగ్రీతో ఉత్తీర్ణత ఉండాలి. క్లాట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఆగస్టు 8 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 18న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు.


✪ అండ‌ర్‌గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రోగ్రామ్ (ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)
అర్హత‌: క‌నీసం 45 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. వచ్చే ఏడాది మార్చి/ ఏప్రిల్‌లో ఇంటర్ ప‌రీక్షలు రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
కోర్సు వ్యవధి: 5 సంవత్సరాలు.
✪ పీజీ ప్రోగ్రామ్ (ఎల్ఎల్ఎం డిగ్రీ).
అర్హత‌: క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఎల్ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణత‌. వచ్చే ఏడాది ఏప్రిల్/మేలో జరిగే లా డిగ్రీ ప‌రీక్షలు రాసేవారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
కోర్సు వ్యవధి: ఏడాది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష (క్లాట్‌-2023) ద్వారా.


దరఖాస్తు ఫీజు:  ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.3,500, ఇతరులు రూ.4,000 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.

క్లాట్‌ పరీక్ష విధానం..

క్లాట్ యూజీ: 
✪ క్లాట్ యూజీ పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. మొత్తం 150 మార్కులకుగాను 150 ప్రశ్నలకు క్లాట్‌ పరీక్ష జరుగుతుంది. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. 
✪ క్లాట్‌ యూజీలో మొత్తం ఐదు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ విభాగం నుంచి 10శాతం(13–17) , ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 20 శాతం(28–32), లీగల్‌ రీజనింగ్‌ 20 శాతం(35–39), కరెంట్‌ అఫైర్స్‌(జనరల్‌ నాలెడ్జ్‌తో కలిపి) నుంచి 25శాతం(35–39), లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 25శాతం(28–32) ప్రశ్నలు వస్తాయి. 
పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్‌:
✪ పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్‌ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. కాన్‌స్టిట్యూషనల్‌ లా 60 ప్రశ్నలు–60 మార్కులు, ఇతర లా సబ్జెక్టులు(కాంట్రాక్ట్, టార్ట్స్, క్రిమినల్, ఇంటర్నేషనల్‌ లా, ఎన్విరాన్‌మెంట్, లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా, ఐపీఆర్‌ తదితర) నుంచి 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు...


✦ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.08.2022


✦ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 13.11.2022.


✦ క్లాట్ ప‌రీక్ష తేది: 18.12.2022 (మ. 2గం. - సా. 4 గం.)


 


Notification & Application


 


Also Read:


పేద విద్యార్థుల జీవితాల్లో ‘పరివర్తనం’ - హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌



పేద విద్యార్థులకు 'ఉపకారం' - పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేశారా?


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..