హైదరాబాద్ సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్‌సీఆర్‌ఐ) 2023-2024 విద్యాసంవత్సరానికి బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌(పీసీబీ/ పీసీఎం/ పీసీఎంబీ)తో పాటు టీఎస్‌ ఎంసెట్‌-2023 ర్యాంకు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు జులై 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో జులై 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  


కోర్సు వివరాలు..


* నాలుగేళ్ల బీఎస్సీ(ఆనర్స్‌) ఫారెస్ట్రీ కోర్సు.


సీట్ల కేటాయింపు: బయాలజీ స్ట్రీమ్ - 75 శాతం సీట్లు,  మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ – 25 శాతం సీట్లు.


అర్హత: ఇంటర్మీడియట్‌(పీసీబీ/ పీసీఎం/ పీసీఎంబీ)తో పాటు టీఎస్‌ ఎంసెట్‌-2023 ర్యాంకు సాధించి ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.2000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ప్రవేశ విధానం: టీఎస్‌ ఎంసెట్‌-2023 ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.07.2023.


➥ రూ.500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.07.2023.


Notification


Online Application


Website


ALSO READ:


బాస‌ర ఆర్జీయూకేటీ తొలి ఎంపిక జాబితా విడుద‌ల‌, 1404 మంది విద్యార్థులకు ప్రవేశాలు!
బాస‌ర ఆర్జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాల‌కు సంబంధించి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా జులై 3న విడుద‌లైంది. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఎంపికైన విద్యార్థుల జాబితాను అందుబాటులో ఉంచారు. తొలిదశలో మొత్తం 1404 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీకిలో ఓపెన్ కేట‌గిరిలో 640 మంది విద్యార్థులు, ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరిలో 118 మంది, బీసీ కేట‌గిరిలో 346 మంది, ఎస్సీ కేట‌గిరిలో 178 మంది, ఎస్‌టీ కేట‌గిరిలో 119 మంది విద్యార్థులు ఎంపిక‌య్యారు. తొలి జాబితాలో సీట్లు పొందిన విద్యార్థుల‌కు జులై 7 నుంచి 9 వ‌ర‌కు కౌన్సెలింగ్ నిర్వహించ‌నున్నారు. జాబితాలో 1వ నెంబరు నుంచి 500 వ‌ర‌కు జులై 7న, 501 నుంచి 1000 వ‌ర‌కు జులై 8న, 1001 నుంచి 1404 వ‌రకు జులై 9న కౌన్సెలింగ్ నిర్వహించ‌నున్నారు. అలాగే దివ్యాంగులు, స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు జులై 14న ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఇక ఎన్‌సీసీ, క్యాప్ విభాగాలకు చెందినవారికి జులై 15న సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు యూనివ‌ర్సిటీ అధికారులు వెల్లడించారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్‌ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్‌ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


దటీజ్ తెలంగాణ, దేశంలో 43 శాతం కొత్త MBBS సీట్లు మనవే- గర్వంగా ఉందన్న హరీష్ రావు
వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం కొన్ని వేల కొత్త సీట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అరుదైన ఘనత సాధించింది. 2023- 24 అకడమిక్ ఇయర్ నుంచి దేశ వ్యాప్తంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన మెడికల్ సీట్లలో 43 శాతం సీట్లు తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీలవే అయినందుకు చాలా గర్వంగా ఉందన్నారు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial