ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్ల భర్తీకి డిసెంబరు 29 వరకు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ డిసెంబరు 28న ప్రకటించింది. మొదటి విడత కౌన్సెలింగ్ తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని  ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ  కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.


ప్రవేశాలు కోరువారు డిసెంబరు 28 సాయంత్రం 4 గంటల నుంచి డిసెంబరు 29న సాయంత్రం 6 గంటల వరకు తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వర్సిటీ సూచించింది. మెరిట్ జాబితాతోపాటు సీట్ల ఖాళీల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 


Web Options Link 


Website


                               


Also Read


డిగ్రీ అర్హతతో బీఎస్సీ పారామెడికల్ కోర్సులు, 9 కాలేజీల్లో 860 సీట్లు! 
తెలంగాణలో తొలిసారిగా వైద్యవిద్య అనుబంధ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం​ అనుమతించింది. దీంతో మొత్తం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 12 రకాల అనుబంధ కోర్సులు, 860 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు మంగళవారం (డిసెంబరు 27న)  వైద్యారోగ్య శాఖ అధికారిక ఉత్తర్వులు (జీవో నెంబర్ 156) జారీచేసింది. 2022-23 వైద్య విద్య సంవత్సరం నుంచే గాంధీ, ఉస్మానియా, కాకతీయ, రిమ్స్, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తంగా 860 పారామెడికల్ సీట్లను అందుబాటులోకి తీసుకురానుంది.


రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలతో పాటు, వైద్య విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రం ఏర్పాటు తర్వాత 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించగా, మరో రెండేళ్లలో జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య విద్య అనుబంధ సేవలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


బీఎస్సీ మొదటి ఏడాదిలో 12 వైద్య విద్య అనుబంధ కోర్సులు ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులు మూడేళ్ల కోర్సుతో పాటు ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా నాలుగేళ్ల కాల వ్యవధిలో బీఎస్సీ పారామెడికల్ విద్యను పూర్తి చేయాలి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రతి సంవత్సరం 860 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగవనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.


విభాాగాలు: అనస్తీషియా, ఆపరేషన్ థియేటర్, రెస్పిరేటరీ థెరపీ, రీనల్ డయాలసిస్, న్యూరోసైన్స్, క్రిటికల్ కేర్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ, మెడికల్ రికార్డ్స్ సైన్సెస్, ఆప్తోమెట్రిక్, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కోర్సులు ఇందులో ఉన్నాయి. త్వరలో న్యూక్లియర్ మెడిసిన్, రేడియోథెరపీ టెక్నాలజీ కోర్సులను కూడా ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ రెండు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి పరిధిలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..