సీటెట్‌-2021(CTET 2021) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) మంగళవారం ప్రకటించింది.


ఈ ఏడాది సీటెట్‌కుకు హాజరైన 27.73 లక్షల మంది అభ్యర్థుల్లో 6.65 లక్షల మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.


డిసెంబర్ 16, 2021 నుంచి జనవరి 21, 2022 వరకు పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలను ఈ సాయంత్రం ప్రకటించారు. పూర్తి ఫలితాలను సీటెట్‌ వెబ్‌సైట్‌ ctet.nic.inలో, CBSE వెబ్‌సైట్ cbse.nic.inలో చూసుకోవచ్చు. 






అభ్యర్థుల మార్క్ షీట్లు, అర్హత సర్టిఫికెట్లు కూడా త్వరలో డిజి లాకర్‌లో అప్‌లోడ్ చేస్తారు. అభ్యర్థులు సీటెట్‌ డిసెంబర్‌లో నిర్వహించిన పరీక్షకు దరఖాస్తు చేసుకున్న టైంలో ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌ ఉపయోగించి వాటిని డౌన్‌లౌడ్ చేసుకోవచ్చు. 


సీటెట్‌ పేపర్ 1 పరీక్షకు 18,92,276 మంది నమోదు చేసుకున్నారు. అందులో 14,95,511 మంది పరీక్షకు హాజరయ్యారు. 4,45,467 మంది ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.






ఈ లింక్‌ క్లిక్‌ చేసి సీటెట్‌ 2021 ఫలితాలను చూసుకోండి.


సీటెట్‌(CTET) ఫలితాలను 2021 ఎలా చూసుకోవాలి:



  • ctet.nic.inలో సీబీఎస్‌ఈ(CBSE) సీటెట్‌(CTET)అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. 

  • హోమ్‌పేజీలో, సీటెట్‌-2021(CTET 2021) ఫలితాలు అనే లింక్‌పై క్లిక్‌ చేయాలి. 

  • మీ స్క్రీన్‌పై కొత్త పేజ్ వస్తుంది. 

  • సీటెట్‌-2021(CTET 2021) కోసం దరఖాస్తు చేసుకున్న టైంలో ఇచ్చిన వివరాలు ఇస్తే లాగిన్ అవ్వొచ్చు.

  • అలా చేసినవెంటనే సీటెట్‌-2021(CTET 2021) ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. 

  • మీ ఫలితాలు చూసుకొని సీటెట్‌-2021(CTET 2021)ఫలితాలను డౌన్‌లౌడ్‌ చేసుకోవచ్చు.

  • భవిష్యత్ అవసరాల కోసం ఓ కాపీని ప్రింట్ తీసుకొని పెట్టుకోండి.