ఆయుష్ నీట్ పీజీ సీట్ల భర్తీకి నిర్వహించిన కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలను ఆయుష్ సెంట్రల్ కౌన్సెలింగ్ కమిటీ (ఏఏసీసీసీ) అక్టోబరు 4న విడుదల చేసింది. ఎండీ, ఎంఎస్ ఆయుర్వేద, సిద్ధా, యునాని, హోమియోపతి పీజీ కోర్సులకు సంబంధించి మొదటి విడత సీట్లను కేటాయించారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రోల్ నెంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి సీట్ల కేటాయింపు వివరాలను చూసుకోవచ్చు. మొత్తం 835 మంది విద్యార్థులకు ఆయుర్వేదం, 37 మంది సిధ్ధాలో,  62 మంది యునానీలో, 189 మంది హోమియోలో సీట్లు పొందారు.


ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 2 వరకు రిజిస్ట్రేషన్, ఆప్షన్ల నమోదు, ఆప్షన్ల లాకింగ్ ప్రక్రియ నిర్వహించారు. అక్టోబరు 3, 4 తేదీల్లో సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబరు 4న సాయంత్రం 3 గంటల నుంచి, అక్టోబరు 13న సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రొవిజినల్ అడ్మిషన్ లెటర్ పొందాల్సి ఉంటుంది. తర్వాత సీటు కేటాయింపు సీట్ల కేటాయింపు ఫలితాలతోపాటు అభ్యర్థులు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేసేందుకు అవసరమైన నిబంధనలను ఏఏసీసీసీ విడుదల చేసింది.  


సీట్ల కేటాయింపు ఫలితాల కోసం క్లిక్ చేయండి..



ALSO READ:


కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సులు - వివరాలు ఇలా
వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌,  2023-24 విద్యా సంవత్సరానికి వర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశానికి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ప్రవేశాలు కోరేవారు అక్టోబరు 1 నుంచి అక్టోబరు 7 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ (నర్సింగ్‌) లేదా పోస్ట్‌ బీఎస్సీ(నర్సింగ్‌) ఉత్తీర్ణతతో పాటు అయిదేళ్ల పని అనుభవం ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నిమ్స్‌'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, 2023 విద్యా సంవత్సరానికి మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ(ఎంపీటీ) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 7లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎన్టీరంగా యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో ఎన్నారై కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్, ప్రవేశం ఇలా
గుంటూరులోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అగ్రికల్చర్ కోర్సుల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశాలు కోరువారు నిర్ణీత నమూనాలో రూ.200 విలువచేసే నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్‌పై అండర్‌టేకింగ్ ఇవాల్సి ఉంటుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...