Rashtriya Indian Military College (RIMC), Dehradun Admissions: డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2026 జనవరి సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు మార్చి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి జూన్ 1న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష, వాయిస్ వైవా, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

వివరాలు...

* రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌ - 8వ తరగతి ప్రవేశాలు (జనవరి సెషన్) 2026

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఏడోతరగతి ఉత్తీర్ణులు/చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 01.01.2026 నాటికి 11.5 - 13 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.01.2013 - 01.07.2014 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజు చెల్లించగానే ఆర్‌ఐఎంసీ దరఖాస్తు ఫారం, ప్రాస్పెక్టస్‌, పాత ప్రశ్నపత్రాలను స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా పంపుతారు. విద్యార్థులు దరఖాస్తు ఫారాన్ని నింపి అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి ఏపీపీఎస్సీ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుతోపాటు అభ్యర్థులు మున్సిపల్‌ కార్పొరేషన్‌/గ్రామ పంచాయతీ జారీ చేసిన బర్త్‌ సర్టిఫికెట్‌; నివాసం, కులం ధ్రువీకరణ పత్రాలు; బోనఫైడ్‌ సర్టిఫికెట్‌; ఆధార్‌ కార్డ్‌; విద్యార్థి 2 ఫొటోలు పంపాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, వాయిస్ వైవా, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.555 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. లేదా సంబంధిత చిరునామాకు డిమాండ్ డ్రాఫ్ట్ పంపడం ద్వారా కూడా దరఖాస్తులు పొందవచ్చు. 

రాత పరీక్ష: మొత్తం 400 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్‌ నుంచి 125 మార్కులకు, మ్యాథమెటిక్స్‌ నుంచి 200 మార్కులకు, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 75 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. విద్యార్థులు సమాధానాలను హిందీ లేదా ఆంగ్ల మాధ్యమంలో రాయవచ్చు. ఈ పరీక్షలో అర్హత సాధించినవారికి వైవా వోస్‌ నిర్వహిస్తారు. దీనికి 50 మార్కులు ఉంటాయి. ఇందులో ఇంటెలిజెన్స్‌, పర్సనాలిటీ, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తదితర అంశాలు పరీక్షిస్తారు. ఇందులో కూడా అర్హత సాధించినవారికి మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రం: విజయవాడ.

డిడి పంపాల్సిన చిరునామా:“THE COMMANDANT RIMC FUND”, DRAWEE BRANCH, HDFC BANK, BALLUPUR CHOWK,DEHRADUN, (BANK CODE - 1399), UTTARAKHAND.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:Assistant Secretary (Exams), APPSC Public, New Heads of Departments Building, Second Floor, Near RTA Office, Indira Gandhi Municipal Stadium, MG Road, Vijayawada- 520010, Andhra Pradesh.

ముఖ్యమైన తేదీలు..

➥ దరఖాస్తు సమర్పణకు చివరితేదీ: 31.03.2025

➥ పరీక్ష తేది: 01.06.2025.

పరీక్ష సమయం:

➥ మ్యాథమెటిక్స్ - ఉ.9:30 గం. – ఉ.11:00 గం. వరకు

➥ జనరల్ నాలెడ్జ్ - మ.12:00 గం.- మ.13:00 గం. వరకు

➥ ఇంగ్లిష్ - మ.14:30గం.- సా.16:30 గం. వరకు

Notification

Web Note

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..