ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్‌ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను గురువారం (జులై 13) విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచారు. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళంలోని ఒక్కో ట్రిపుల్‌ ఐటీలో 1000 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. జులై 20 నుంచి 25 వరకు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


ఆర్‌కేవ్యాలీ ఆర్జీయూకేటీ ఎంపిక జాబితా..


నూజివీడు ఆర్జీయూకేటీ ఎంపిక జాబితా.. 


ఒంగోలు ఆర్జీయూకేటీ ఎంపిక జాబితా.. 


శ్రీకాకుళం ఆర్జీయూకేటీ ఎంపిక జాబితా..


కాల్ లెటర్ల కోసం క్లిక్ చేయండి..
 


కౌన్సెలింగ్‌కు ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి..


కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. రెండు సెట్ల జిరాక్స్ కాపీలతోపాటు, ఒరిజినల్ సర్టిఫికేట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.


1) పదోతరగతి పరీక్షల హాల్‌టికెట్


2) పదోతరగతి మార్కుల జాబితా (గ్రేడ్-షీట్)


3) 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ/బోనఫైడ్ సర్టిఫికేట్లు.


4) రెసిడెన్స్ సర్టిఫికేట్


5) క్యాస్ట్/కమ్యూనిటీ/ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్.


6) ఇన్‌కమ్ సర్టిఫికేట్ (01.04.2023 తర్వాత జారీచేసినది).


7) విద్యార్థి ఫోటోలు-6, రెండు తల్లిదండ్రుల ఫోటోలతోపాటు, ఇద్దరు గార్డియన్‌ల ఫోటోలు ఉండాలి. 


8) ఫ్యామిలీ రేషన్ కార్డు కాపీ. 


9) ఆధార్ కార్డు. 


10) చదువు కోసం బ్యాంకు రుణం కోరేవారు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు క్యాంపస్‌లో బ్యాంకులో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుతోపాటు కింది డాక్యుమెంట్లు అవసరమవుతాయి.


➥ 4 సెట్ల సర్టిఫికేట్ కాపీలు 


➥ తల్లిదండ్రులు ఉద్యోగులైతే ఎంప్లాయి ఐడీ కార్డు కాపీ. 


➥ గడచిన 3 నెలల శాలరీ సర్టిఫికేట్లు (పే స్లిప్స్) 


➥ విద్యార్థి, తల్లిదండ్రుల పాన్‌కార్డు


➥ రేషన్ కార్డు/పాన్‌కార్డు/ఓటరు ఐడీకార్డు/ఆధార్ కార్డు (విద్యార్థి, తల్లిదండ్రుల)


➥ చివరి 6 నెలల బ్యాంకు స్టేట్‌మెంట్.


➥ విద్యార్థి ఫోటోలు-6, రెండు తల్లిదండ్రుల ఫోటోలు నాలుగు అవసరమవుతాయి.


ALSO READ:


APSAHPC: ఏపీ వైద్య కళాశాలల్లో పారామెడికల్ డిప్లొమా కోర్సులు, వివరాలు ఇలా!
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్(ఏపీఎస్ఏహెచ్‌పీసీ) 2023-2024 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటు పారామెడికల్‌ కళాశాలల్లో అందుబాటులో ఉన్న వివిధ పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. రెండేళ్ల కాలపరిమితితో అందిస్తున్న ఈ కోర్సులకు ఇంటర్మీడియట్‌ బైపీసీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జులై 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్‌ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్‌ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial