Mayank Madhur: బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదొక వివాదంలో చిక్కుకుంటుంది.  బహిరంగంగా ఆమె చేసే చేష్టలు లేదా సోషల్ మీడియాలో పలు విషయాలపై ఆమె స్పందించే తీరు సినీ ఇండస్ట్రీలోనే కాదు రాజకీయంగా కూడా చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకుంది. కంగనా రనౌత్ పై బీజేపీకు సంబంధించిన మయాంక్ మాధుర్ అనే నాయకుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఆమె ఒక మోసగత్తె అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా కంగనా పై లీగల్ యాక్షన్ కు దిగాడు. ఇంతకీ ఈ వివాదం ఏంటో మీరే చూడండి..


అవకాశం ఇస్తానని నన్ను మోసం చేసింది: మయాంక్ మాధుర్


కంగనా రనౌత్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆమె కొన్నేళ్లుగా జాతీయ బీజేపీ పార్టీకు మద్దతుగా పలు సందర్భాల్లో మాట్లాడింది కూడా. ఆమె వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు దుమారం రేపుతూనే ఉన్నాయి. అయితే తాజాగా బీజేపీకే చెందిన ఓ నాయకుడు మయాంక్ మాధుర్ కంగనా పై ఆరోపణలు చేయడం చర్చనీయాంశమవుతోంది. కంగనా బేజేపీలో పొలిటికల్ లీడర్స్ రాజ్నాథ్ సింగ్, శివ్రాజ్ సింగ్ చౌహాన్ వంటి వారితో పరిచయం చేసేందుకు తానే సాయం చేశానని అన్నాడు. అందుకు ప్రతిఫలంగా ఆమె తదుపరి చిత్రం ‘తేజస్’లో తనకు ఓ క్యారెక్టర్ ను ఆఫర్ చేసిందని చెప్పాడు. ఆమె పని అయిన తర్వాత కనీసం తనను పట్టించుకోలేదని, క్యారెక్టర్ ఇవ్వకపోగా తాను సర్వీస్ చేసినందుకు కనీసం డబ్బులు కూడా ఇవ్వకుండా మోసం చేసిందని వాపోయాడు. అంతేకాకుండా కంగనా పై లీగల్ యాక్షన్ కు సిద్దమయ్యాడు మయాంక్. ఇప్పుడిదే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 


అక్టోబర్ 20 న ‘తేజస్’..


కంగనా రనౌత్ తాజాగా నటించిన చిత్రం ‘తేజస్’. ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. కంగనా రనౌత్ నుంచి వస్తోన్న భారీ యాక్షన్ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. అందుకే ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీను అక్టోబర్ 30 న విడుదల చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించింది మూవీ టీమ్. వార్, యాక్షన్ డ్రామా మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కంగనా రనౌత్ లీడ్ రోడ్ లో నటిచింది. సర్వేష్ మేవారా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు. అయితే ఈ మూవీ విడుదల సమయం దగ్గరపడుతోన్న టైమ్ లో బీజేపీ నేత కంగనా పై ఆరోపణలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. 


తెలుగులోనూ కంగనా పరిచయమే..


ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఏక్ నిరంజన్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది కంగనా. అయితే ఈ సినిమా తర్వాత ఎక్కువగా తెలుగులో సినిమాలు చేయలేదు. అయితే ఆమె నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. ఆ విధంగా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది కంగనా. ఆ మధ్య తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ లో టైటిల్ పాత్ర పోషించి మెప్పించిన కంగనా ప్రస్తుతం ‘తేజస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే ‘ఎమర్జెన్సీ’ మూవీతో కంగనా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తోంది. మరోవైపు తమిళ్ లో ‘చంద్రముఖి 2’ లో కూడా నటిస్తోంది ఈ బ్యూటీ.


Also Read: మోహన్‌లాల్, రోషన్ ఒకే సినిమాలో - టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్!