Ap Intermediate Results 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి.  తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో, బోర్డు కార్యదర్శి ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ఒకే రోజు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు పూర్తైన 22 రోజుల్లోనే  రికార్డు స్ధాయిలో ఫలితాలను ఇంటర్‌ బోర్డు వెల్లడించనుండటం విశేషం. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు ప్రథమ సంవత్సరం 5,17,617 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,35,056 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. వీరిలో 9,99,698 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం జనవరి 4న పూర్తి చేశారు. దీంతో ఫలితాలను వెల్లడించడానికి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి మార్కుల రూపంలో ఫలితాలను విడుదల చేస్తారా.. లేక గ్రేడ్ల వారీగా ఫలితాలను విడుదల చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. 


ఇంటర్ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలు చూసుకోవచ్చు. పరీక్షా ఫలితాలను పొందాలనుకునే విద్యార్థులు తమ రోల్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా అధికారిక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. పరీక్షా ఫలితాల రోజే ఇంప్రూమెంట్, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించనున్నారు ఇంటర్ బోర్డు అధికారులు.


ముందుగా రిజల్ట్ తెలుసుకోండిలా


 ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ఏబీపీ దేశంలో రిజిస్టర్ కావడం ద్వారా ఫలితాలు అందరికంటే ముందుగా తెలుసుకోవచ్చు. ఫలితాలు తెలుసుకోవాలనుకునే విద్యార్థులు ఇక్కడ క్లిక్ చేయండి. అనంతరం మీ పేరు రోల్ నెంబర్, మీ గ్రూప్, ఈ మెయిల్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫలితాలు వెల్లడైన వెంటనే మీ మెయిల్, మొబైల్ కు రిజల్ట్ వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం అందరి కంటే వేగంగా రిజల్ట్ తెలుసుకునేందుకు ఇందులో రిజిస్టర్ అవ్వండి.


 ఇంటర్ సెకండియర్ విద్యార్థులు సైతం ఏబీపీ దేశంలో రిజిస్టర్ కావడం ద్వారా ఫలితాలు అందరికంటే ముందుగా తెలుసుకోవచ్చు. ఫలితాలు తెలుసుకోవాలనుకునే విద్యార్థులు ఇక్కడ క్లిక్ చేయండి. అనంతరం మీ పేరు రోల్ నెంబర్, మీ గ్రూప్, ఈ మెయిల్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫలితాలు వెల్లడైన వెంటనే మీ మెయిల్, మొబైల్ కు రిజల్ట్ వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం అందరి కంటే వేగంగా రిజల్ట్ తెలుసుకునేందుకు ఇందులో రిజిస్టర్ అవ్వండి.


 ఇంటర్ సెంకడియర్ విద్యార్థులు ఏబీపీ దేశంలో రిజిస్టర్ కావడం ద్వారా ఫలితాలు అందరికంటే ముందుగా తెలుసుకోవచ్చు. ఫలితాలు తెలుసుకోవాలనుకునే విద్యార్థులు ఇక్కడ క్లిక్ చేయండి. అనంతరం మీ పేరు రోల్ నెంబర్, మీ గ్రూప్, ఈ మెయిల్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫలితాలు వెల్లడైన వెంటనే మీ మెయిల్, మొబైల్ కు రిజల్ట్ వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం అందరి కంటే వేగంగా రిజల్ట్ తెలుసుకునేందుకు ఇందులో రిజిస్టర్ అవ్వండి.


Also Read: Pradhan Mantri Matru Vandana Yojana: గర్భవతులకు ఆరువేల ఆర్థిక సాయం - కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?