AU: ఏయూ-బీటీహెచ్‌ ఇంటిగ్రేటెడ్ బీఎస్‌ ఎంఎస్‌ ప్రోగ్రామ్‌, విదేశాల్లో చదివే ఛాన్స్!

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ, స్వీడన్‌లోని బ్లెకింగే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(బీటీహెచ్‌) సహకారంతో నిర్వహిస్తున్న బీఎస్‌-ఎంఎస్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

Continues below advertisement

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ, స్వీడన్‌లోని బ్లెకింగే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(బీటీహెచ్‌) సహకారంతో నిర్వహిస్తున్న బీఎస్‌-ఎంఎస్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది ఆరేళ్ల వ్యవధి గల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌. మొదటి మూడేళ్లు ఏయూలో, చివరి మూడేళ్లు స్వీడన్‌ బీటీహెచ్‌లో చదవాల్సి ఉంటుంది. 

Continues below advertisement

ప్రోగ్రామ్ వివరాలు..

* బీఎస్‌-ఎంఎస్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ (3+1+2)

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌- సెన్సర్స్‌ అండ్‌ సిస్టమ్స్‌.

అర్హత: కనీసం 70% మార్కులతో ఇంటర్మీడియట్(మ్యాథ్స్‌, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: జేఈఈ(మెయిన్స్‌)-2023/ ఏపీ ఈఏపీసెట్‌-2023/ టీఎస్‌ ఎంసెట్‌ 2023/ ఏయూఈఈటీ 2023 ర్యాంకు/ ఇంటర్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు సమర్పణకు చివరితేదీ: 22.07.2023.  

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Dean, International Affairs,
1st Floor Science and Technology Bhavan
(AU Science College Principal’s Office Building),
Andhra University, Visakhapatnam- 530003, India

Notification & Application

Website

ALSO READ:

జేఎన్‌టీయూ గుడ్ న్యూస్, ఇకపై ఆ కాలేజీల్లోనూ ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు ఛాన్స్!
ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలు చేయాలనుకునేవారికి జేఎన్‌టీయూ హైదరాబాద్ శుభవార్త వినిపించింది. ఇకపై జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లోనూ విద్యార్థులు పరిశోధనలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో 170 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు అవకాశం కల్పిస్తున్నట్లు జేఎన్‌టీయూహెచ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జేఎన్‌టీయూ అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు, పరిశోధనలను నిర్వహించేందుకుగాను ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

బీఆర్క్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలోని ఆర్కిటెక్చర్ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ నిర్వహించే ఆప్టిట్యూడ్‌ టెస్టు ఎన్‌ఏటీఏ (NATA)–2021లో (లేదా) జేఈఈ మెయిన్స్ పేపర్‌–2 (బీఆర్క్‌)–2021లో అర్హత సాధించినవారు, ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు, పదోతరగతితోపాటు డిప్లొమా పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఆర్కిటెక్చర్ కాలేజీల్లో 830 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది.
ప్రవేశాల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, జులై 29 నుంచి రిజిస్ట్రేషన్!
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన 'టీఎస్ ఈసెట్‌-2023' కౌన్సెలింగ్‌ షెడ్యూలును అధికారులు ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం జులై 29 నుంచి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్‌ ప్రారంభంకానుంది. ఆగస్టు 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన అభ్యర్థులకు జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇక ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 
ఈసెట్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement