అద్దె ఇంటి కోసం తిరుగుతున్నట్లు నటించిన యువకుడు చైన్ చోరీ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని నిజాంపేటలో జరిగింది. అద్దె ఇంటి కోసం వెతుకున్నట్లుగా వచ్చి చైన్ స్నాచింగ్ చేసిన ఘటన నిజాంపేట్ లో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల సీసీ ఫుటేజీ సేకరించారు. నిందితుడ్ని త్వరలోనే అరెస్ట్ చేశామన్నారు. అయితే ఒంటరి మహిళలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా అనుమానంగా తిరుగుతుంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. 
అసలేం జరిగిందంటే..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లి పియస్ పరిధి నిజాంపేట్ లో శ్రీనివాస్ కాలనీకి చెందిన స్వర్ణలత(62) స్థానికంగా గుడికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఓ వ్యక్తి ఆమెకు ఎదురుపడి అద్దె ఇంటి విషయమై చర్చించాడు. దాంతో ఆ మహిళ ఇల్లు అద్దెకు లేదని చెప్పినా వినకుండా ఆమెను ఫాలో అవుతూ ఇంటివరకు వచ్చాడు నిందితుడు. 
లిఫ్ట్ లోకి వెళ్లగానే చైన్ చోరీ..
ఆ పెద్దావిడ తాను నివాసం ఉంటున్న బాలాజీ రెసిడెన్సీలోని లిఫ్ట్ లోపలికి రాగానే వెంటనే నిందితుడు లిఫ్ట్ గ్రిల్ ఓపెన్ చేసి ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.


పోలీసులు ఏమన్నారంటే..
స్వర్ణలత అనే 62 ఏళ్ల మహిళ సాయిబాబా గుడికి వెళ్లారు. పూజలు పూర్తయిన తరువాత ఇంటికి వెళ్తుంటే, గుడిలో పరిచయం చేసుకున్న నిందితుడు ఆమెను అద్దె ఇల్లు గురించి వాకబు చేశాడు. తమ అపార్ట్ మెంట్లో అద్దె ఇల్లు లేదని చెప్పినా అతడు వినిపించుకోలేదు. ఆమెను ఫాలో అవుతూ ఇంటికి వెళ్లాడు. ఆమె లిఫ్ట్ ఎక్కిన తరువాత నిందితుడు గ్రిల్స్ ఓపెన్ చేసి మహిళ మెడలోని బంగారు చైన్ ను బలవంతంగా లాక్కెళ్లాడని పోలీసులు తెలిపారు. రెండు మూడు ఇళ్లల్లోకి వెళ్లి, అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారయ్యారని పోలీసులు వెల్లడించారు.


గుడికి వస్తే భక్తుడు అనుకున్నానని బాధితురాలు స్వర్ణలత తెలిపారు. తన స్నేహితురాలు వెళ్లిపోగా, తాను ఇంటికి వెళ్తుండగా అద్దె ఇల్లు ఉంటే చెప్పాలని తనను నిందితుడు అడిగినట్లు చెప్పారు. ఖాళీ ఇల్లులు లేవని చెప్పినా అతడు వినలేదని, తనను ఫాలో అయ్యాడని చెప్పారు. తీరా అపార్ట్ మెంట్ కు చేరుకున్నాక లిఫ్ట్ ఎక్కి ఒక్క డోర్ క్లోజ్ చేశాక, నిందితుడు డోర్ ఓపెన్ చేసి తన మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు చైన్ లాక్కెళ్లాడని చెప్పి ఆమె వాపోయారు.


వరంగల్‌లో ఇదే తరహాలో.. 
వరంగల్ : చైన్ స్నాచింగ్ కు పాల్పడిన దొంగతో పాటు, ఈ కేసు సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులను ఐనవోలు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఐనవోలు దేవాలయం పరిసర ప్రాంతంలో ఈ చైన్ చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల వద్ద నుంచి 40 గ్రాముల బంగారు ఆభరణంతో పాటు లక్ష ఎనభైవేల రూపాయల నగదు ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


ఈ అరెస్టు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్ వివరాలను వెల్లడించారు. వరంగల్ జిల్లాలోని గీసుగొండ మండలం, వంచనగిరి ప్రాంతానికి చెందిన నిందితుడు ఎల్లబోయిన హరీష్ ఈ నెల 21వ తేదిన యాదాద్రి జిల్లా బీబీనగర్ ప్రాంతానికి చెందిన గండు వసంత అనే మహిళ  చెల్లించుకోనేందుకుగాను ఐనవోలు జాతరలో ఎల్లమ్మగుడి వద్ద బోనం ఎత్తుకోనే సమయంలో సదరు మహిళ మెడలోని బంగారు పుస్తెల తాడును చోరీ చేసాడు. ఈ చోరీపై ఫిర్యాదు నమోదు చేసుకున్న ఐనవోలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.