YSR District News: వైఎస్సార్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ప్రమాదం జరిగింది. కడపకు చెందిన ఆజాద్ నగర్ కాలనీ చెందిన ముస్లింలు ఆటోలో మల్లెల వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు మహమ్మద్ (25), షాకీర్ (10), హసీన (25), అమీన (20)గా గుర్తించారు.  స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. క్షతగాత్రుల రోదనలతో ఆ ప్రాంతం భీకరంగా మారింది. స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.