ఓ మహిళ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది మందిని పెళ్లిచేసుకుంది. మళ్లీ కొత్త పెళ్లికూతురిలా.. తొమ్మిదో పెళ్లి చేసుకోబోతుంటే.. పోలీసులు వచ్చి అసలు ట్విస్ట్ చెప్పారు. ఇక అప్పుడు మెుదలైంది 8 మంది భర్తల్లో గుబులు. ఏం చేయాలో అర్థంకాని పరస్థితి వారిది. ఇంతకీ ఏం జరిగింది. ఆ మహిళ ఎవరు?


పెళ్లి కావాల్సిన యువకులు.. విడాకులతో ఒంటరిగా ఉన్నవారిని ఏరికోరి పట్టుకుంటుంది. వారిని పెళ్లి చేసుకుంటుంది. పట్టుమని పది రోజులు కూడా కాపురం చేయదు. ఏదో ఒక కారణంతో విడాకులు తీసుకుంటుంది. ఆ విడాకులకు భారీ ఎత్తున భరణం చెల్లించుకుని ఉడాయిస్తున్న ఓ ఘరానా మహిళ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇలా ఏకంగా 8 మందిని భర్తలుగా చేసుకుని మోసం చేసింది. ఇది ఇలా ఉండగా ఆ 8 మంది భర్తలకు మరో టెన్షన్‌ వచ్చి పడింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే..


హర్యానాలోని కైతాల్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళకు 2010లో పాటియాలాలో వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలకు తల్లి కూడా అయింది. అయితే నాలుగేళ్ల తర్వాత భర్త అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా అతని ఆచూకీ కనిపించలేదు. ఎలా బతకాలో అర్థం కాలేదు. ఈ క్రమంలో మోసాలు చేయడం ప్రారంభించింది. పంజాబ్, హర్యానాలలో బ్రహ్మచారులు, విడాకులు తీసుకున్న లేదా భార్య చనిపోయిన భర్తలను ట్రాప్ చేయడం మొదలుపెట్టింది. తన తల్లితో పాటు మరికొందరు బంధువులతో ఇలా చేసేది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తిని ట్రాప్ చేసి రహస్యంగా ఏ గుడిలోనో పెళ్లి చేసుకుంటుంది. 


అలా పెళ్లిళ్లు చేసుకుని.. వారం.. పది రోజులు మాత్రమే.. కాపురం చేస్తుంది. తర్వాత భర్తతో ఏదో ఒక గొడవ పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. చివరకు సెటిల్మెంట్ చేసుకునే స్కేచ్ వేస్తుంది. లక్షల్లో డబ్బులు తీసుకుని.. ఉడాయిస్తుంది.  ఇప్పటి వరకు ఆమె.. ఇలా 8 మందిని పెళ్లిళ్లు చేసుకుంది. అయితే ముగ్గురు యువకులు ఇటీవలే ఆమెపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె గురించి.. గాలింపు చేసి పట్టుకున్నారు. జైల్లో పెట్టారు. ఇటీవల ఆమెకు పరీక్షలు చేయగా.. హెచ్ ఐవీ ఎయిడ్స్ ఉన్నట్టు తేలింది. ఇప్పుడు ఆ 8 మంది భర్తలకు ఒకటే భయం. తమకు హెచ్ ఐవీ ఉందేమోనని. అయితే వారికి కూడా పోలీసులు.. పరీక్షలు చేపించనున్నారు.  


Also Read: Crime News: ఏంటమ్మా.. ఇది పద్ధతేనా.. కత్తితో కూరగాయలు కోయమంటే.. అత్తను కోసేశావ్