Wife Cut Husband Private Part In Prakasam: మద్యం తాగి వేధిస్తున్నాడని ఓ మహిళ తన భర్త మర్మాంగాన్ని కోసేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన విజయ్ యాదవ్ ఉపాధి కోసం ఇక్కడకు వచ్చి గత కొంతకాలంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడులోని ఓ పశువుల డైరీ ఫామ్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అదే డైరీ ఫామ్‌లో పని చేస్తోన్న బీహార్ రాష్ట్రానికే చెందిన సీతాకుమారి అనే మహిళతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే, ఇతనికే ఇదివరకే వివాహం అయ్యింది. మొదటి భార్యను బీహార్‌లోనే ఉంచేసి.. ఇక్కడ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరకు ఆమెను వివాహం చేసుకున్నాడు. గర్భం దాల్చిన తర్వాత తనను పట్టించుకోవడం లేదని సీతాకుమారి తరచూ భర్తతో గొడవపడేది. 


వేధిస్తున్నాడనే ఆగ్రహంతో..


ఈ క్రమంలోనే శనివారం రాత్రి విజయ్ యాదవ్ మద్యం సేవించి రాగా సీతాకుమారితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి సహనం కోల్పోయిన సీతాకుమారి కత్తితో భర్తపై దాడి చేసింది. భర్త మర్మాంగాన్ని కోసేయగా.. తీవ్రంగా గాయపడ్డ భర్తను చూసి భయంతో తన డైరీ ఫామ్ యజమానికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పి అక్కడి నుంచి పరారైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సీతాకుమారి కోసం గాలింపు చేపట్టారు. 


Also Read: Srikalahasti News: 13ఏళ్ల బాలికపై నలుగురు యువకుల అత్యాచారం! తరచూ అదే పని, గర్భం దాల్చిన బాధితురాలు