Villagers Attacked On Woman In Annamayya District: ఓ మహిళను గ్రామంలోని మహిళలు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు చేశారు. కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి బాధిత మహిళను విడిపించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా (Annamayya District) వీరబల్లి మండలం షికారిపాలెంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను గ్రామస్థులు చెట్టుకు కట్టేసి కర్రలతో కొట్టారు. చిత్రహింసలకు గురి చేసి కోడిగుడ్లతో దాడి చేశారు. బాధిత మహిళ ఇటీవలే భర్త నుంచి విడిపోయి మరో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె తప్పు చేసిందని పలువురు మహిళలు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని రక్షించారు. అనంతరం చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మరోవైపు, పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ వసతిగృహంలో ఎన్‌సీసీ సీనియర్ విద్యార్థులు.. జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూనియర్లను సీనియర్లు కర్రలతో విచక్షణా రహితంగా కొడుతూ పైశాచికానందం పొందిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై విచారించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగినట్లు నిర్ధారించారు.


Also Read: Raging: ర్యాగింగ్ వికృత క్రీడ - జూనియర్లపై సీనియర్ల పైశాచికత్వం, పల్నాడు జిల్లాలో ఘటన