Udaipur killer BJP member :   రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్‌ కన్హయ్య లాల్‌ను మంగళవారం దారుణంగా తల నరికి చంపిన హంతకులు రియాజ్ అఖ్తరీ, గోస్ మొహమ్మద్‌లకు బీజేపీతో సంబంధాలున్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. నిందితులు బీజేపీ నేతలతో కలిసి దిగిన ఫొటోల ఆధారాలను కాంగ్రెస్‌ నేతలు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. 



కన్హయ్యను చంపిన కిల్లర్స్‌లో ఒకరైన రియాజ్‌ అఖ్తరీ రాజస్థాన్‌ బీజేపీ మైనారిటీ సెల్‌లో కీలక సభ్యుడని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.  బీజేపీ మైనార్టీ సెల్‌ నేతలైన ఇర్షాద్ చైన్‌వాలా, మహ్మద్ తాహిర్‌తో ప్రధాన నిందితుడు దిగిన ఫొటోలను మీడియా ఎదుట  బయటపెట్టారు. అంతేగాక రాజస్థాన్‌ బీజేపీ నేత, మాజీ మంత్రి గులాబ్‌చంద్ కటారియా కార్యక్రమాల్లో కూడా రియాజ్‌ పాల్గొన్న  ఫోటోలు కూడా విడుదల చేశారు. 


 





 





 


హంతకులు బీజేపీకి చెందిన వారు కాబట్టే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కేసును తొక్కిపెట్టేందుకు ఎన్‌ఐఏ దర్యాప్తునకు అప్పగించిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.  మరోవైపు కాంగ్రెస్‌ నేతల ఆరోపణలను బీజేపీ ఖండించింది. ప్రవక్తపై సోషల్‌ మీడియాలో పోస్టులు చేసిన కన్హయ్య లాల్‌ను చంపిన నిందితులు బీజేపీ సభ్యులు కాదని ఆ పార్టీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్ మాల్వియా తెలిపారు. కాంగ్రెస్‌ చేస్తున్నవన్నీ తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలని విమర్శించారు. ఫోటోలు సాక్ష్యాలు కాదని స్పష్టం చేసింది. ఈ కేసు విషయంలో ఉగ్రకోణం ఉందని.. కేంద్రం భావిస్తోంది. అందుకే ఎన్‌ఐఏ విచారణకు ఆదేశించింది.