తిరుపతిలో అతి కిరాతకమైన ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన ఓ భర్త తన భార్యను సూట్ కేసులో పెట్టి చెరువులో పడేశాడు. ఈ హత్య అనంతరం భర్త వేణు గోపాల్‌తో పాటు ఆయన కుటుంబసభ్యుల పరారీ అయ్యారు. ఈ ఘటన జరిగిన 5 నెలల తర్వాత ఇప్పుడు భార్య శవం ఉన్న సూట్ కేసును చెరువులో నుంచి బయటకు తీస్తున్నారు.


తిరుపతి జిల్లా సత్యనారాయణపురంలో ఈ ఘటన జరిగింది. పద్మ అనే మహిళ అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. జనవరి 5న సత్యనారాయణపురంలో వివాహిత పద్మ కనిపించడం లేదంటూ అదృశ్యం కేసు నమోదైంది. పద్మ తల్లిదండ్రులు ఈ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు.. భర్త వేణుగోపాల్ హత్య చేసినట్లు గుర్తించారు. పద్మను హత్య చేసి.. మృతదేహాన్ని వెంకటాపురం చెరువులో పడేసినట్లు గుర్తించారు. హత్య అనంతరం భర్త వేణుగోపాల్‌తో పాటు కుటుంబసభ్యుల పరారయ్యారని తెలిపారు. మృతదేహం కోసం వెంకటాపురం చెరువులో ఈస్ట్ పోలీసులు గాలింపునకు సిద్ధమైయ్యారు. కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసి ఆనవాళ్లు లేకుండా చేసినట్లుగా తెలుస్తోంది.