Madhya Pradesh Crime News:



ఇండోర్‌లో ఘటన..


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణ హత్య జరిగింది. లైంగిక కోరిక తీర్చలేదన్న కోపంతో లివిన్ పార్ట్‌నర్‌ని కత్తెరతో పొడిచి దారుణంగా చంపాడో వ్యక్తి. వారం రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో మహిళ మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే హత్య వెనకాల కారణాలు బయటపడ్డాయి. డిసెంబర్ 9వ తేదీన పోలీసులు డెడ్‌బాడీని గుర్తించారు. ఇంటికి తాళం వేసిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి పేరు ప్రవీణ్ సింగ్‌గా గుర్తించారు. ప్రవీణ్‌ సింగ్‌, బాధితురాలు కొద్ది రోజులుగా ఆ ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. తన లైంగిక కోరిక తీర్చాలని ఆ యువతిపై ఒత్తిడి తీసుకచ్చాడు ప్రవీణ్ సింగ్. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. ఈ కోపంతోనే కత్తెరతో మెడపై కిరాతకంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసిన తరవాత భయంతో ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు. వెళ్లే ముందు ఆ యువతి మొబైల్ ఫోన్‌ కూడా తీసుకుని వెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 7వ తేదీన ఈ హత్య జరిగినట్టు గుర్తించారు. నిందితుడి కోసం దాదాపు మూడు రోజుల పాటు గాలించి చివరకు అరెస్ట్ చేశారు. 


బెంగళూరులోనూ..


బెంగళూరులో ఓ 29 ఏళ్ల యువకుడు లివిన్ పార్ట్‌నర్‌ని కుక్కర్‌తో కొట్టి చంపాడు. ఈ ఏడాది ఆగస్టులో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. తనను మోసం చేసే వేరే వ్యక్తితో యువతి చనువుగా ఉంటోందని అనుమానం పెంచుకున్నాడు యువకుడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా రోజులుగా వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ప్రెజర్ కుక్కర్‌తో గట్టిగా యువతిని కొట్టాడు. అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఇద్దరూ కేరళకు చెందిన వాళ్లే. దాదాపు రెండేళ్లుగా బెంగళూరులో ఓ ఇంట్లో అద్దెకి ఉంటున్నారు. కాలేజ్‌ రోజుల నుంచే ఇద్దరికీ పరిచయం ఉంది. కోరమంగళలోని ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే...తనతో సహజీవనం చేస్తూ వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందన్న కోపంతో గొడవకు దిగాడు నిందితుడు వైష్ణవ్. మాటామాట పెరిగింది. కుక్కర్‌తో గట్టిగా కొట్టాడు. మృతురాలి ఫోన్ స్విచ్ఛాప్ రావడం వల్ల ఆమె సోదరి కంగారు పడింది. ఇంటికి వెళ్లి చూసింది. అక్కడా కనిపించకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చాక ఈ దారుణం వెలుగు చూసింది. యువతిని చంపిన తరవాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అన్ని చోట్లా గాలించిన పోలీసులు చివరకు అరెస్ట్ చేశారు.  వీళ్లిద్దరూ లివిన్‌లో ఉన్నారని తల్లిదండ్రులకు కూడా తెలుసని వెల్లడించారు పోలీసులు. వాళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసినా పట్టించుకోలేదని, అదే ఈ హత్యకు దారి తీసిందని చెప్పారు. స్థానికులు కూడా ఈ జంట పదేపదే గొడవ పడేదని చెబుతున్నారు. 


Also Read: Lok Sabha Security Breach: అందుకే లోక్‌సభపై దాడి చేశాం! విచారణలో నిజాలు బయట పెట్టిన నిందితులు