Crime News in Telugu:


బిహార్‌లో పూజారి హత్య..


బిహార్‌లో ఓ పూజారి దారుణ హత్యకు గురయ్యాడు. కొద్ది రోజులుగా కనిపించకుండా పోయాడు. చివరకు దారుణమైన స్థితిలో మృతదేహం కనిపించింది. దుండగులు ఆయనను కాల్చి చంపారు. కళ్లు బయటకు తీసి మర్మాంగాలు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యతో స్థానికులు ఆగ్రహానికి లోనయ్యారు. పోలీసులతో గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. మృతుడి పేరు మనోజ్‌ కుమార్‌గా గుర్తించారు పోలీసులు. దాణాపూర్ గ్రామంలోని శివాలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. దాదాపు ఆరు రోజులుగా కనిపించకుండా పోయాడని స్థానికులు వెల్లడించారు. ఇంటి నుంచి ఆలయానికి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు గాలిస్తున్నారు. కానీ ఎక్కడా జాడ దొరకలేదు. డిసెంబర్ 16న ఓ చోట పొదల్లో మృతదేహం కనిపించింది. ఈ డెడ్‌బాడీ కనిపించకుండాపోయిన పూజారిదేనని కన్‌ఫమ్ చేసుకున్నారు. స్థానికులకు ఈ విషయం తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ హత్య జరిగిందని మండి పడ్డారు. పోలీసులపై స్థానికులు రాళ్లు రువ్వారు. హైవేపై పార్క్ చేసి ఉన్న పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. గాల్లో కాల్పులు జరిపి పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే...బాధితుడి సోదరుడు కూడా కనిపించకుండా పోవడం అనుమానాలకు తావిస్తోంది. ఎక్కడికైనా వెళ్లుంటాడని కుటుంబ సభ్యులు పెద్దగా ఆలోచించలేదు. కానీ ఎంతకీ రాకపోవడం వల్ల ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు. ఇంతలోనే మృతదేహం కనిపించడం వాళ్లను తీవ్ర అసహనానికి గురి చేసింది. 


బిహార్‌లోని పట్నాలో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో ప్రియురాలు ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటనలో బాధితుడి ముఖం తీవ్రంగా కాలిపోయింది. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మొత్తం ఇద్దరు కలిసి ఈ దాడి చేసినట్టు పోలీసులు వెల్లడించారు. సిమర్‌వాదా గ్రామంలో ఈ ఘటన జరిగినట్టు వివరించారు. తెల్లవారుజామున ఇద్దరు ఈ దాడికి పాల్పడినట్టు తెలిపారు. బాధితుడి పేరు ధర్మేంద్ర కుమార్‌గా వెల్లడించారు. ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న ధర్మేంద్రను ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 5 నెలలుగా ధర్మేంద్ర, సరిత కుమారి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తెల్లవారు జామున 2 గంటలకు సరిత..ధర్మేంద్రకి కాల్ చేసి కలవాలని చెప్పింది. ఆమెని కలిసి తిరిగి ఇంటికి వస్తుండగా ప్రియురాలితో పాటు మరో వ్యక్తి ముఖంపై యాసిడ్ పోశారు. ఆ మంట తట్టుకోలేక గట్టిగా కేకలు వేశాడు. స్థానికులు ఉలిక్కిపడి బయటకు వచ్చారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. 


"ధర్మేంద్ర ఆమెని కలవడానికి ఇంటికి వెళ్లాడు. కలిసి తిరిగి బయటకు వస్తుండగా ఆమెతో పాటు మరో వ్యక్తి వచ్చి యాసిడ్‌ దాడి చేశారు. కేకలు విని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిని ఇప్పటికే అరెస్ట్ చేశాం. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు"


- పోలీసులు


Also Read: మందు తాగుదామని పిలిచి ఆపై కత్తితో దాడి, 17 ఏళ్ల బాలుడి దారుణ హత్య