ప్రశాంత విశాఖ ( Vizag )  నగరంలో మరోసారి డ్రగ్స్  ( Drugs ) కలకలం రేగింది.  ఈ దందాను విద్యార్థులే నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.  ఇంజినీరింగ్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బెంగళూరు ( Bengalore ) నుంచి  స్ఫటిక రూపంలో డ్రగ్స్ తీసుకు వచ్చి విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి 54 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వారి ముగ్గురినీ ( Three Arrest ) అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ డ్రగ్స్ అమ్మకాల వెనుక ఈ ముగ్గురే ఉన్నారా.. లేకపోతే పెద్ద ముఠా ఏమైనా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. 


భార్య గొంతులో స్క్రూ డైవర్ పొడిచిన భర్త - వెంటనే ఇంటికి తాళం వేసి పరార్!


స్పటిక రూపంలో ఎండీఎంఏ ( MDMA ) తరహా డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి తీసుకు వస్తున్నారు. ఈ తరహాలో డ్రగ్స్ విక్రయం జరగడం ఇదే మొదటి సారి. దీంతో అసలు ఎంత కాలం నుంచి ఈ దందా జరుగుతోందన్న విషయంపై పోలీసులు ( Vizag Police ) ఆరా తీస్తున్నారు. విశాఖలో డ్రగ్స్ కేసులు తకకువే.  జనవరినెలలో  విశాఖలో ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ ( Airport ) జోన్ పోలీసులు సంయుక్తంగా దాడి జరిపి డ్రగ్స్ సీజ్ చేశారు.   ఈ కేసులో ఒక యువతిని, మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా తేలింది.  వీరి వద్ద నుంచి టాబ్లెట్ల రూపంలో ఉన్న 18 పిల్స్, 2 ఎండిఎం పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇప్పుడు బయటపడిన డ్రగ్స్ మాత్రం భిన్నమైనవి. 


విశాఖ కోర్టు సంచలన తీర్పు, పోక్సో కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష


విశాఖ ఏజెన్సీ ( Visaka Agency ) నుంచి దేశవ్యాప్తంగా గంజాయి ( Ganja ) రవాణా సాగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి కానీ... డ్రగ్స్ కేసులు పెద్దగా బయటపడలేదు. అయితే  కొన్నాళ్లుగా కొన్ని  ప్రఖ్యాత ప్రైవేటు విద్యా సంస్థలను ( Pricate Colleges  ) టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగం జరుగుతోందన్న ఆరోపణలు మాత్రం బలంగా వస్తున్నాయి. ఈ దిశగా పోలీసులు జరిపిన దాడుల్లో మొదటిసారిగా ముగ్గురిని పట్టుకున్నారు. వారి నుంచి పూర్తి వివరాలు బయటకు వస్తే విశాఖలో డ్రగ్స్ దందా చేస్తున్న వారి గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది.