Pocso Case Against The Teacher In Krishna District: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కృష్ణా జిల్లా (Krishna District) పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు (Kankipadu) మండలంలో ఓ టీచర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈడుపుగల్లు గ్రామంలోని పాఠశాలలో పని చేసే మండవ వెంకట శ్రీనివాస్ గత కొంతకాలంగా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధిత విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వారు సదరు ఉపాధ్యాయునిపై కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్‌లు విచారణ జరిపి నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.


Also Read: Nalgonda News: నల్గొండ జిల్లాలో దారుణం - కన్నతల్లి గొంతు కోసి చంపేసిన తనయుడు, ఆపై తానూ ఆత్మహత్య