హైదరాబాద్: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌లో ఓ కారు అదుపు తప్పి ఫుట్ పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న ఒక వ్యక్తి మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. బసవతారకం ఆసుపత్రి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి అందులోని వ్యక్తులు పరారయ్యారని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.