నిజామాబాద్ నగరంలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. భిక్షాటన చేస్తున్న మహిళ కొడుకుకి బట్టలు ఇస్తామని చెప్పి బాలుడ్ని తీసుకొని మాయలేడీలు పరారయ్యారు.  దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. మాయలేడీలు బాలుడ్ని కిడ్నాప్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.  


నగరంలో మాయలేడీలు 


నిజామాబాద్ నగరంలో మాయలేడీల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. అమాయక యువకులను మోసం చేయటమే కాకుండా చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నారు. నగరంలో తాజాగా ఓ బాలుడ్ని మహిళలను కిడ్నాప్ చేసిన ఘటన వెలుగు చూసింది. నగరంలోని చౌరస్తా వద్ద భిక్షాటన చేస్తున్న లక్ష్మీ అనే మహిళ నుంచి ఆమె కొడుకు కార్తీక్(ఆరు నెలలు) ను బట్టలు ఇస్తామని తీసుకెళ్లారు. ఎంతసేపటికీ బాలుడ్ని తిరిగి తీసుకురాకపోయే సరికి లక్ష్మీ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై 4వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. బాలుడ్ని ఎక్కడికి తీసుకెళ్లారన్న దానిపై ఆరాతీస్తున్నారు. కిడ్నాప్ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కిడ్నాప్ కేసును ఛేదించేందుకు సీపీ నాగరాజు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.


Also Read : బిచ్చగాడితో గొడవ పెట్టుకుని మరీ చంపేశారు ! ఇలాంటి సైకోలు కూడా ఉంటారా?


పాత దుస్తులు ఇస్తానని చెప్పి కిడ్నాప్ 


ఆరు నెలల బాలుడి అపహరణ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. లక్ష్మీ అనే మహిళ తన ఇద్దరు పిల్లలు కావేరి 8 ఏళ్లు, కార్తీక్‌ 6 నెలల కలిసి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంది. వినాయక్‌నగర్‌లో టిఫెన్ సెంటర్ వద్ద ఉండగా ఓ మహిళ పరిచయమైంది. పాత దుస్తులు ఇస్తానని చెప్పి తనతో పాటు లక్ష్మీని, పిల్లలను రావాలని కోరింది. వాళ్లను తీసుకుని కొంత దూరం నడిచి వెళ్లాక లక్ష్మీ నుంచి ఆరు నెలల బాలుడ్ని తీసుకుని సదరు మహిళ ముందుకెళ్లింది. అక్కడ ఓ ఇంటిని చూపిస్తూ దుస్తులు తీసుకొస్తానని, వాళ్లను అక్కడే ఆగాలని చెప్పింది. ఎంతసేపు వేచిచూసిన మహిళ రాకపోయే సరికి అనుమానం వచ్చిన లక్ష్మీ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన 4వ టౌన్ ఎస్సై సందీప్‌ దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలతో కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. 


Also Read : Crime News : 36 ఏళ్ల మహిళపై పోక్సో కేసు - ఎంత ఘోరానికి పాల్పడిందంటే ?


Also Read : విశాఖలో కలకలం - విద్యార్థిపై దాడి చేసిన గసగసాలు, ఎలక !