నెల్లూరు జిల్లా కావలి మండలం చెన్నాయపాళెం క్రాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మహిళను ఢీకొట్టి ఆ వెంటనే కంటైనర్‌ లారీని ఢీకొట్టి స్విప్ట్ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో మహిళతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాల పాలైన మరో ఇద్దరిని నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను అతికష్టం మీద పోలీసులు బయటకు తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


తిరుపతిలో నలుగురు 


తిరుపతి జిల్లా నారాయణవనం బైపాస్‌ వద్ద కాలేజీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. కారులో ఉన్న మరో మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు పుత్తూరు మండలం పరమేశ్వర మంగలముకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారు రమేష్‌ నాయుడు, పుష్ప, భాను, వనజాక్షిగా గుర్తించారు. గాయపడిన మరో మహిళను వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. పరమేశ్వరమంగలముకు చెందిన వీరంతా కారులో చెన్నైలోని పెరంబూరులో బంధువుల ఇంట్లో ఎంగేజ్ మెంట్ కి వెళ్లి వస్తుండగా కాలేజీ బస్సు ఢీకొంది. ఈ కాలేజీ బస్సు పుత్తూరు శ్రీవిద్య కళాశాలకు చెందిన బస్సు అని పోలీసులు చెప్పారు.