Siddipet Crime News | సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో బండరాళ్లు మీద పడి తల్లీ కూతురు మృతిచెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో ఈ విషాదం జరిగింది. మృతులను తల్లి సరోజ, కూతురు మమతగా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Crime News: ఉపాధి హామీ పనుల్లో తీవ్ర విషాదం, బండరాళ్లు మీద పడి తల్లీకూతురు మృతి
Shankar Dukanam
Updated at:
30 Jan 2025 10:36 AM (IST)
Telangana News | కూలీ పనులకు వెళ్లిన ఆ తల్లీకూతుళ్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పని కోసం వెళ్తే బండరాళ్లు మీద పడటంతో ఇద్దరు మృతిచెందగా, మరికొందరికి గాయాలయ్యాయి.

ఉపాధి హామీ పనుల్లో తీవ్ర విషాదం, బండరాళ్లు మీద పడి తల్లీకూతురు మృతి