ఓ వైద్య విద్యార్థిని హత్యకు గురైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాకినాడలోని ఓ లాడ్జిలో వివాహిత నిన్న రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరుకు చెందిన గుంపుల సుధారాణి నిన్న రాత్రి హత్యకు గురైంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో సుధారాణి ఫస్టియర్ డిప్లమో అనస్తీషియా చదువుతుంది. 


సుధారాణి.. పెదపాడుకు చెందిన రాజు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ కలిసి ఈ నెల 17న కాకినాడ ద్వారకా లాడ్జిలో దిగారు. నిన్న రాత్రి వీరిద్దరి మధ్య గొడవ చెలరేగినట్లు తెలుస్తోంది. ఇది ఘర్షణకు దారితీయడంతో రాజు.. సుధారాణిని కత్తితో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత రాజు ఏలూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read: అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం.. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ గతంలో సెల్ఫీ వీడియో


Also Read: Breaking News September 21: గుంటూరులో నిమజ్జనంలో ఉద్రిక్తత.. ఇంట్లో సామగ్రి, బైక్‌కు నిప్పు