Man Shot Dead in Hospital: ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో దారుణం జరిగింది. మూడో అంతస్తులో ఉన్న ఓ పేషెంట్ రూమ్‌కి వెళ్లిన దుండగుడు కాల్పులు జరిపాడు. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. జూన్ 23న రియాజుద్దిన్ కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. గుర్తు తెలియని ఓ వ్యక్తి హాస్పిటల్‌కి వచ్చాడు. పేషెంట్‌ని చూడడానికి వెళ్తానని చెప్పి లోపలికి వెళ్లాడు. జేబులో నుంచి గన్‌ తీసి 3-4 రౌండ్‌ల కాల్పులు జరిపాడు. హాస్పిటల్‌ బెడ్‌పైనే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రక్తపు మడుగుని చూసి ఒక్కసారిగా సిబ్బంది షాక్ అయింది. కాల్పులు జరిపిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ హత్యకి కారణమేంటన్నది తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. 


 






ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే పోలీసులు హాస్పిటల్‌కి వెళ్లారు. అప్పటికే బాధితుడు రక్తపు మడుగులో ఉన్నాడు. కాసేపటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. స్పెషల్ టీమ్స్‌ని ఏర్పాటు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వ్యక్తిగత కక్షల వల్లే హత్య చేసినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు.