Khammam Drugs : ఖమ్మంలో డ్రగ్స్ కలకలం, ఆరు నెలలుగా నగరంలో మకాం సీక్రెట్ గా డ్రగ్స్ దందా!

ABP Desam   |  Satyaprasad Bandaru   |  23 Jun 2022 07:25 PM (IST)

Khammam Drugs : ఖమ్మంలో డ్రగ్స్ కలకలం రేగింది. కారులో డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను ఎక్సైజ్ పోలీసులు పక్కా సమాచారంతో అరెస్టు చేశారు.

ఖమ్మంలో డ్రగ్స్ కలకలం

Khammam Drugs : ఖమ్మం జిల్లాలో డ్రగ్స్ కలకలం రేగింది. ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్ వద్ద ఎక్సైజ్ పోలీసులు పక్క సమాచారంతో డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తు్న్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకులు ఖమ్మం సారథి నగర్ కు చెందిన భాను తేజ,  పల్లె గూడెంకు చెందిన రోహిత్ రెడ్డి అని పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి సుమారు 1600 గ్రాముల గంజాయి , 10 గ్రాముల MDMA, 10 గ్రాముల లిక్విడ్ గంజాయితో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై బెంగుళూరు  హైదరాబాద్ లలో పలు కేసులు ఉన్నాయని ఎక్సైజ్ సూపరిండెంట్ నాగేందర్ రెడ్డి తెలిపారు. ఇలా డ్రగ్స్ పట్టుబడటం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇది మొట్టమొదటి కేసు అన్నారు. నిందితులు విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ ప్రాంతాలకు కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. మత్తుపదార్ధాలను రూ.2 వేలకు కొనుగోలు చేసి, దాదాపు రూ. 7 వేల వరకు అమ్ముతున్నారని అని ఎక్సైజ్ సూపరిండెంట్ నాగేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, బెంగుళూరులో డ్రగ్స్ సరఫరాపై కఠినంగా వ్యవహరించడంతో కార్యకలాపాలను ఖమ్మం జిల్లాకు షిఫ్ట్ చేశారని తెలిపారు. ఈ ముఠాను పట్టుకోవటంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పోలీసు సిబ్బందిని ఎక్సైజ్ సూపరిండెంట్ అభినందించారు. 

ఆరు నెలలుగా ఖమ్మంలో మకాం 

పక్కా సమాచారంతో సీసీ సర్కిళ్లో తనిఖీలు చేశాం. ఇద్దరు యువకులు డ్రగ్స్ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వీరు గత ఆరు నెలలుగా ఖమ్మంలో ఉంటున్నారు. ఇక్కడ నుంచి హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడకు డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. దీనిపై ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. నిందితుల్లో ఒకడైన భాను తేజ ఐటిఐ చేసి, బెంగళూరు జాబ్ కోసం వెళ్లాడు. అక్కడ డ్రగ్స్ అమ్మే వాళ్లతో సంబంధాలు పెట్టుకున్నాడు. బెంగళూరులో ఇతనిపై కేసు ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ కూడా పోలీసులు పట్టుకుని కేసులు పెట్టారు. హైదరాబాద్ లో ఎక్సైజ్ వాళ్లు డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపడంతో ఖమ్మం నగరానికి తన బేస్ మార్చుకున్నాడు. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. - - ఎక్సైజ్ సూపరిండెంట్ నాగేందర్ రెడ్డి 

Also Read : Ganja Smuggling: ట్రావెలింగ్ బ్యాగ్‌లో గంజాయి- ముసుగు వేసుకొని ఎస్కేప్‌కు ప్లాన్- కిలేడీ స్కెచ్‌కు పోలీసులు షాక్

Also Read : Minister Gangula PRO Crime : స్టేషన్‌ బెయిల్‌ ఇప్పిస్తే రూ. లక్ష - అడ్డంగా దొరికిన మంత్రి కమలాకర్ పీఆర్వో !

Published at: 23 Jun 2022 07:23 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.