ఆనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం విషాదం నింపింది. గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శెట్టూరు మండలం ములకలేడులో ఈ ఘోరం జరిగింది. 


శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయపడ్డారు. 


మృతి చెందిన వారిలో కుటుంబ పెద్ద జైనాభి(60),  ఈమె కుమారుడు దాదు(36),  కోడలు సర్ఫున్ని (28) మూడేళ్ళ మనవరాలు బేబీ ఉన్నారు. 


సిలిండర్ పేలుడు ధాటికి రెండు పక్కాఇల్లు కుప్పకూలాయి. కుప్పకూలిన ఇంటి శిథిలాల కింద పడిన ఆరుగు వ్యక్తుల్లో నలుగు స్పాట్‌లోనే చనిపోయారు.


తీవ్రంగా గాయపడిన వారిలో తండ్రి కొడుకు రజాక్, అబ్దుల్లా ఉన్నారు. వాళ్లిద్దర్ని కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాళ్లిద్దరి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది.