Chittoor Road Accident: చిత్తూరు :  చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట - పూతలపట్టు జాతీయ రహదారిలోని పి.కొత్త కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుండి తిరుపతి వైపుగా కర్ణాటక పోలీసులు వాహనంలో వస్తుండగా వాహనం అతివేగం కారణంగా అదుపు తప్పి అండర్ బ్రిడ్జ్ వద్ద ఇనుప పిల్లర్ ను ఢీకొని బొల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.


ఉదయమే తీవ్ర విషాదం.. 
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎస్సై అవినాష్, కానిస్టేబుల్ అనిల్, ప్రైవేటు డ్రైవర్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి సంఘటన స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఎస్సై దీక్షిత్, కానిస్టేబులను శరవణ, బసవలను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్ధితి విషమంగా ఉండడంగా వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక పోలీసులు ఓ కేసు విషయమై వేళ్తుండగా ఉదయం 4:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి తెలిపారు.
Also Read: Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తిని అడ్డుకోవడం ప్రజల చేతుల్లోనే ఉంది, ఇలా చేస్తే ఆ వ్యాధి వ్యాపించదు


Also read: రొమ్ముక్యాన్సర్ ఆడవారికే వస్తుందనుకుంటే మీ భ్రమే, మగవారికీ వచ్చే ఛాన్స్, లక్షణాలు ఇలా ఉంటాయి