BTech Student Suicide:  కూతురు ఎవరితోనే ప్రేమ పేరుతో తిరుగుతోందని అమ్మాయి తండ్రికి తెలిసినప్పుడు ఏం జరుగుతుంది ?. మొదట తన కుమార్తెను హెచ్చరిస్తాడు..తర్వాత తన అమ్మాయితో మాట్లాడవద్దని ఆ కుర్రాడ్ని హెచ్చరిస్తాడు. ఇంకా కొందరు హింసాత్మకంగా స్పందించవచ్చు. కానీ ఈ అమ్మాయి తండ్రి మాత్రం భిన్నం.  పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఒత్తిడి భరించలేక ఆ  లవర్ ప్రాణం తీసుకున్నాడు.  


తన కుమార్తె లవర్ ను బ్లాక్ మెయిల్ చేసిన తండ్రి      


ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో  రామ్ స్వరూప్ విశ్వవిద్యాలయంలో రెండవ సంవత్సరం బి.టెక్ విద్యార్థి తుషార్ వర్మ, కొత్వాలి నగర్ ప్రాంతంలోని లఖ్‌పెడాబాగ్ ప్రాంతంలో ఉరి వేసుకుని మరణించాడు. తుషార్‌ను అతని ప్రియురాలి తండ్రి బ్లాక్‌మెయిల్ చేసి వేధిస్తున్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అతను రూ. 30 లక్షలు డిమాండ్ చేశాడని, అందుకే తుషార్  ప్రాణం తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు.        


వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న బీటెక్ యువకుడు   
 
తుషార్ సోదరి అతని మొబైల్ ఫోన్‌ను పరిశీలించినప్పుడు అసలు విషయం బయటపడింది.  ఆ తర్వాత ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికతో పాటు  ఆమె కుటుంబం బ్లాక్‌మెయిల్ , దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించింది. తుషార్ తల్లి సుష్మ, తన కొడుకు ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం కలిగి ఉన్నాడని, ఆ జంట ఫోటోల ద్వారా ఇది బయటపడింది. బాలిక తండ్రి మజ్ను పటేల్ పోలీసులకు ఫిర్యాదులు చేయడం ద్వారా, పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం ద్వారా తమ కుటుంబాన్ని పదే పదే వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. ప్రాథమిక ఒప్పందం ఉన్నప్పటికీ, పటేల్ రూ.30 లక్షలు డిమాండ్ చేస్తూనే ఉన్నాడని తెలిపింది.  


లవర్ కూడా తండ్రితో కలిసి బ్లాక్ మెయిల్ చేసినట్లుగా ఆరోపణలు        


ఇంటర్మీడియట్ విద్యార్థిని అయిన ఆరాధ్య అనే అమ్మాయి తన సోదరుడితో కలిసి బారాబంకిలో నివసిస్తోంది. తుషార్ ఆరాధ్య సోదరుడితో స్నేహం చేస్తున్నాడు.  వారి ఇంటికి తరచుగా వచ్చేవాడు. ఆత్మహత్యకు దాదాపు వారం ముందు, ఆరాధ్య కుటుంబం తుషార్‌పై వేధింపుల ఆరోపణలు చేసింది. దీని ఫలితంగా లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది.   పోలీసుల మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదిరింది. అయితే, వేధింపులు కొనసాగాయని తుషార్ కుటుంబం ఆరోపిస్తోంది.         


కలకలం రేపిన విద్యార్థి ఆత్మహత్య                  


ఆత్మహత్య జరిగిన రాత్రి, తుషార్ తన తల్లి ,  సోదరితో కలిసి భోజనం చేసి వేరే గదిలో నిద్రపోయాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో, తుషార్ తన మొబైల్ ఫోన్‌లో తన బాధను వివరించే వీడియోను రికార్డ్ చేశాడు.  ఆరాధ్య కుటుంబం దోపిడీ ,  మానసిక వేధింపులకు పాల్పడిందని ఆరోపించాడు. ఆ తర్వాత అతను తన తల్లి చీరను ఉపయోగించి  ఉరి వేసుకున్నాడు. తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందడంతో, వారు తుషార్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు.