గర్ల్​ఫ్రెండ్​ కోరిక మేరకు ఓ బీజేపీ లీడర్​ తన భార్యను దారుణంగా హతమార్చాడు. ఆపై దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు అతడితోపాటు గర్ల్​ఫ్రెండ్​ను అరెస్ట్​ చేసి కటకటాల్లోకి పంపారు. ఈ ఘటన రాజస్థాన్​లోని అజ్మీర్‌లో జరిగింది. 24 గంటల్లోనే కేసును ఛేదించినట్లు అడిషనల్​ ఎస్పీ దీపక్​ కుమార్​ తెలిపారు. 

దొంగలు హత్య చేసి పారిపోయారని నాటకంఅడిషనల్​ ఎస్పీ దీపక్ కుమార్ వివరాల ప్రకారం.. అజ్మీర్​కు చెందిన బీజేపీ లీడర్​ రోహిత్ సైని ఇంట్లో ఆగస్టు 10న ఆయన సంజు అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గుర్తుతెలియని దొంగలు ఆమెను హత్య చేసి విలువైన వస్తువులతో పారిపోయారని రోహిత్ సైని మొదట్లో పోలీసులకు తెలిపారు. అయితే, దర్యాప్తులో రోహిత్​ అనుమానాస్పదంగా కనిపించడం, పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో తానే హత్యకు పాల్పడినట్లు  రోహిత్ ఒప్పుకున్నాడు.

గర్ల్​ఫ్రెండ్​ ఒత్తిడితోనే దారుణంతన గర్ల్​ఫ్రెండ్​ రీతు సైని ఒత్తిడితోనే తన భార్యను చంపినట్లు అంగీకరించాడు. రీతూతో చాలాకాలంగా రోహిత్​కు సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. తమ ఇద్దరి సంబంధానికి సంజు అడ్డంకిగా ఉందని, ఆమెను చంపాలని రీతూ చెప్పడంతో రోహిత్‌ తన భార్యను ఇంట్లో బలమైన ఆయుధంతో కొట్టి చంపాడు. ఆ తర్వాత దోపిడీ నాటకం ఆడినట్లు పోలీసులు తెలిపారు. దోపిడీ జరిగినట్లు ఇంట్లో వాతావరణాన్ని సృష్టించాడని పోలీసులు పేర్కొన్నారు.

మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాం: అడిషనల్​ ఎస్పీరోహిత్​ సైనీతోపాటు హత్యకు ప్రోత్సహించిన గర్ల్​ ఫ్రెండ్​ రీతును అదుపులోకి తీసుకున్నట్లు అడిషనల్​ ఎస్పీ దీపక్ కుమార్ తెలిపారు. కేసు గురించి మరిన్ని వివరాలు వెలికితీసేందుకు తదుపరి విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. 24 గంటల్లో కేసును ఛేదించామని చెప్పారు. ‘పోలీసులు రోహిత్ సైని, స్నేహితురాలు రీతు సైనిని కూడా అరెస్టు చేశారు’ అని వెల్లడించారు.