Bike Hits MLA Kasireddy Car: కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి (Kasireddy Narayanareddy) కారుకు సోమవారం ప్రమాదం జరిగింది. రంగారెడ్డి (Rangareddy) జిల్లా తలకొండపల్లి మండలం వెల్జార్ లో ఎన్నికల ప్రచారం ముగించుకుని వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తోన్న కారును గ్రామ శివారులో ఓ బైక్ ఢీకొట్టింది. రామసిపల్లి మైసమ్మ దేవాలయం సమీపంలో మిడ్జిల్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. నరేశ్ (25) అనే యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పరశురామ్ అనే మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులు వెంకటాపూర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు పూర్తిగా ధ్వంసం కాగా.. ఎయిర్ బెలూన్లు సకాలంలో తెరుచుకోవడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 


Also Read: TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - మరో ఆఫర్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ