Alluri District Road Accident: అల్లూరి జిల్లా ఏవోబీలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏవోబీలో సిమెంట్ లారీ బోల్తా (lorry overturned) పడిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.


పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లా ఏవోబీ కటాఫ్ ఏరియాలో రోడ్డు ప్రమాదం జరిగింది. హంతల్‌గూడ ఘాట్‌ రోడ్డులో సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. చిత్రకొండ నుంచి జడంబోకు లారీ సిమెంట్‌ లోడ్ తీసుకెళ్తుండగా బోల్తా పడటంతో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, భద్రతా సిబ్బంది ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు.