Intelligence DSP Died at Tirumala: తిరుపతి జిల్లాలో శనివారం విషాదం జరిగింది. తిరుమల శ్రీవారి నడక మార్గంలో (Tirumala Step Road) ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ (59) (Intelligence DSP Krupakar) గుండెపోటుతో మృతి చెందారు. 1,805 మెట్టు మార్గం వద్ద కుప్పకూలిన ఆయన్ను గమనించి ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కృపాకర్, ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం తిరుమలకు (Tirumala) వచ్చారు. ఈ క్రమంలో విధుల్లో ఉండగా ఈ ఘటన జరిగింది. ఆయన స్వస్థలం విజయవాడ సమీపంలోని పోరంకి. కాగా, దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply


Also Read: Visakha Fishing harbor Accident: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదం - ఆ ఇద్దరు ఎవరు?