ఉగాది రోజున నాగర్‌ కర్నూల్ జిల్లా చార గొండ మండలం తుర్కపల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి సిమెంట్‌ దిమ్మను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 


ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలుసుకుంటున్నారు.