Sand Dead Body: షాకింగ్ ఘటన - ఇంటి నిర్మాణానికి తెచ్చిన ఇసుకలో తల లేని మృతదేహం, ఎక్కడంటే?

Andhrapradesh News: ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన ఇసుకలో తల లేని మృతదేహం కలకలం రేపింది. బాపట్ల జిల్లా చీరాల మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది.

Continues below advertisement

Dead Body Found In Sand in Bapatla District: ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం ఇసుక ఆర్డర్ ఇచ్చాడు. వచ్చిన ఇసుకను వినియోగిస్తుండగా ఓ తల లేని మృతదేహాన్ని గుర్తించిన కూలీలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విషయాన్ని యజమానికి తెలియజేయగా ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ షాకింగ్ ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల (Bapatla) జిల్లా చీరాల (Cheerala) మండలం ఈపురుపాలెం గ్రామంలోని పద్మనాభునిపేటకు కాగితాల రాంబాబు అనే వ్యక్తి కొత్త ఇంటి నిర్మాణానికి పూనుకున్నాడు. ఇందులో భాగంగా ఓ 10 ట్రాక్టర్ల ఇసుక ఆర్డర్ ఇచ్చాడు. శుక్రవారం సాయంత్రం ఇసుకను ఇంటి ముందు పోశారు. కూలీలు ఇసుకను ఇంటి పునాదుల్లో క్రేన్ తో ఇసుక నింపుతుండగా.. ఓ తల లేని మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఒక్కసారిగా ఆందోళన చెంది యజమానికి విషయాన్ని తెలియజేశారు. ఆయన షాక్ తో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది. రోజు రోజుకూ ఇసుక మాఫియా రెచ్చిపోతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అటు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇసుకలో లభ్యమైన మృతదేహం 2 రోజుల క్రితం పూడ్చి పెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జేసీబీతో ఇసుక తవ్వే క్రమంలో తల ఊడిపోయి ఉంటుందని.. అందుకే మొండెం మాత్రమే మిగిలిందని అనుమానిస్తున్నారు. మృతదేహం ఎవరిది..?. ఇసుకలోకి ఎలా వచ్చింది.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Continues below advertisement

Also Read: YS Sharmila: ఓవైపు వైఎస్ బిడ్డ, మరోవైపు హంతకుడు, మీరే తేల్చండి - ఆడబిడ్డలం కొంగుచాస్తున్నాం: షర్మిల

Continues below advertisement