UP twin marriages bride Arrest: ఉత్తరప్రదేశ్‌లోని బరేల్లీలో ఒక వ్యక్తి ఒకే నెలలో ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్నాడు.  ఏడాది వరకూ ఎవరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేశారు. కానీ తర్వాత ఆయన వల్ల కాలేదు. రెండు పెళ్లిళ్ల విషయం  భార్యలకు తెలిసింది. ఆగ్రహానికి గురైన వారు ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు భార్యల్లో ఒక్కరు కూడా సపోర్టుగా లేకపోగా..ఇద్దరూ కలిసి జైలుకు పంపడంతో ఊచలు లెక్క బెట్టుకుంటున్నాడు.  

Continues below advertisement


యూపీలో రాజేష్ కుమార్ అన ే32 ఏళ్ల వ్యక్తి, బరేల్లీలోని ఒక చిన్న వ్యాపారస్థుడు. 2024 ఆగస్టు 5న  అనిత ను పెళ్లి చేసుకున్నాడు. రాజేష్ ఆమె కుటుంబం నుంచి రూ. 2 లక్షలు 'వ్యాపారానికి' అని చెప్పి కట్నం తీసుకున్నాడు.  15 రోజుల తర్వాత, ఆగస్టు 20న   ప్రియా అనే మహిళను  మరో పెళ్లి చేసుకున్నాడు. ప్రియా కుటుంబం నుంచి కూడా రూ. 1.5 లక్షలు 'పెళ్లి ఖర్చులు' అని  తీసుకున్నాడు. రెండు పెళ్లిళ్లు ఒకే జిల్లాలోని  వేర్వేరు ఊళ్లలో జరిగాయి. ఏదో ఒకటి చెప్పి మెయిన్ టెయిన్ చేయవచ్చని అనుకున్నాడు కానీ.. ఏడాదిలోనే అందరికీ తెలిసిపోయింది. 


ఏడాది తర్వాత, 2025 అక్టోబర్‌లో రాజేష్ ఫోన్‌లోని పాత మెసేజ్‌లు, ఫోటోలు  రెండో భార్య చూసింది.  మొదటి భార్య అనితకు తన స్నేహితురాలి ద్వారా రెండవ పెళ్లి విషయం తెలిసింది. షాక్‌కు గురైన అనిత, ప్రియా వెంటనే ఒకరినొకరు సంప్రదించుకున్నారు. నిజమేనని  ధృవీకరించుకున్నారు. "అతను మమ్మల్ని మాత్రమే కాదు, మా కుటుంబాలను కూడా మోసం చేశాడు. మేము  ఇద్రం న్యాయం కోరుకుంటున్నాం" అని అనిత  పోలీసులుక ఫిర్యాదు చేశారు. ప్రియా కూడా  అదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేసిసింది. ఇద్దరు భార్యలు కలిసి నవంబర్ 15న బరేల్లీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


పోలీసులు రాజేష్‌పై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 494  , 420 (మోసం), 406 (విశ్వాస ద్రోహం) కింద కేసు నమోదు చేశారు.  రాజేష్ రెండు కుటుంబాల నుంచి మొత్తం రూ. 3.5 లక్షలు మోసం చేసి తీసుకున్నాడని అయితే అతని మోసాలు ఇంకా ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.  రాజేష్‌ను నవంబర్ 18న అరెస్టు చేసి, 14 రోజుల రిమాండ్‌లోకి  పంపించారు.