How Effective Are Ayurvedic Remedies And Products: పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులు భారతదేశం అంతటా ఆయుర్వేదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో విజయవంతం అయ్యాయి. ఈ కంపెనీ మధుమేహం మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద చికిత్సలను అందిస్తుంది.
భారతదేశంలో ఆయుర్వేద ఉత్పత్తులు , చికిత్సలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో పతంజలి ఆయుర్వేద కీలక పాత్ర పోషించింది. ఇటీవలి సంవత్సరాలలో, ప్రజలు రసాయన ఆధారిత ఉత్పత్తుల నుండి సహజ , ఆయుర్వేద ప్రత్యామ్నాయాలకు మారడం ప్రారంభించారని కంపెనీ పేర్కొంది. కేశ్ కాంతి షాంపూ, దంతా కాంతి టూత్పేస్ట్ , ఆమ్లా జ్యూస్ వంటి తమ ఉత్పత్తులు వాటి ప్రభావం , సరసమైన ధరకు ప్రసిద్ధి చెందాయని పతంజలి ప్రకటించింది.
ఢిల్లీకి చెందిన 54 ఏళ్ల హీరా శర్మ కేశ్ కాంతి షాంపూను ఉపయోగించిన తర్వాత సానుకూల ఫలితాలను చూసినట్లుగా తెలిపారు. ఈ ఉత్పత్తి తన జుట్టులోని జిడ్డును తగ్గించడంలో సహాయపడిందని సంతోషం వ్యక్తం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాను గతంలో చేసినట్లుగా ప్రతి రెండు రోజులకు బదులుగా ప్రతి 3 నుండి 5 రోజులకు ఒకసారి తన తల స్నానం చేస్తే సరిపోతుందని ఆమె చెబుతున్నారు.
దంతా కాంతితో చిగుళ్ల సమస్యల నుండి ఉపశమనం
పతంజలి తన గులాబీ షర్బత్ను వినియోగదారులలో కూడా బాగా ఇష్టపడుతున్నారని పేర్కొంది. ముంబైకి చెందిన రిషికేశ్ సింగ్ నిమ్మకాయ ,తులసి గింజలతో కలిపి తాగుతానని, ఇది తనకు రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా పని చేస్తుందని సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా, ఢిల్లీకి చెందిన రమేష్ జుయెల్ దంట్ కాంతి టూత్పేస్ట్ను ప్రశంసించారు. ఇది తన చిగుళ్ల సమస్యలను, దంతాల సున్నితత్వాన్ని తగ్గించడంలో సహాయపడిందని తెలిపారు.
డయాబెటిస్, మూత్రపిండాల సమస్యలు ,నొప్పి వంటి వివిధ ఆరోగ్య సమస్యలను నిర్వహించడంలో తమ ఉత్పత్తులు ప్రభావవంతంగా ఉన్నాయని పతంజలి కంపెనీ పేర్కొంది. ముంబైకి చెందిన ఒక కస్టమర్ పతంజలి ఆయుర్వేద మందులు తన డయాబెటిస్ను నియంత్రించడంలో సహాయపడ్డాయని తెలిపారు. హరిద్వార్లోని తమ యోగపీఠం పంచకర్మ , ప్రకృతి చికిత్సల వంటి ఆయుర్వేద చికిత్సలను అందిస్తుందని కూడా పతంజలి పేర్కొంది. ఈ చికిత్సల నుండి మెరుగైన శక్తి స్థాయిలు మరియు ఆరోగ్య ప్రయోజనాలను వినియోగదారులు నివేదించారు.
పతంజలి నాణ్యత మరియు పారదర్శకతపై దృష్టి
ఆయుర్వేదాన్ని విజయవంతంగా ప్రధాన స్రవంతిలోకి తమ సంస్థ తీసుకువచ్చిందని పతంజలి పేర్కొంది. నాణ్యత పారదర్శకతను నిర్వహించడం ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పింది. ప్రజాభిప్రాయం మిశ్రమంగా ఉందని, చాలా మంది వినియోగదారులు తాము అనుభవించిన ప్రయోజనాలతో సంతృప్తి చెందారని పతంజలి గర్వంగా ప్రకటించుకుంది.