Stock Market Closing Bell: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్‌, యూరప్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవడం సెంటిమెను దెబ్బతీసింది. అమెరికా స్టాక్స్‌ కుదేలవ్వడం ఇందుకు మరింత దోహదం చేసింది. ఉదయం నుంచి సెల్లింగ్‌ ప్రెజర్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,411 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 866 పాయింట్లు నష్టపోయింది. ఇన్వెస్టర్లు దాదాపుగా రూ.5 లక్షల కోట్ల సంపదను నష్టపోయారు.  


BSE Sensex


క్రితం సెషన్లో 55,702 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 54,928 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. ఉదయం నుంచే అమ్మకాల ఒత్తిడి కనిపించింది. 55,070 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 54,586 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 866 పాయింట్ల నష్టంతో 54,835 వద్ద ముగిసింది.


NSE Nifty


గురువారం 16,682 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,415 వద్ద ఓపెనైంది. ఉదయం నుంచి నష్టాల్లోనే కదలాడింది. 16,484 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. అమ్మకాల సెగతో 16,340 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 271 పాయింట్ల నష్టంతో 16,411 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ట్రేడ్‌ అయింది. ఉదయం 34,569 వద్ద మొదలైంది. 34,353 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,797 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సెల్లింగ్‌ ప్రెజర్‌ వల్ల చివరికి 641 పాయింట్ల నష్టంతో 34,591 వద్ద క్లోజైంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 11 కంపెనీలు లాభపడగా 39 నష్టాల్లో ముగిశాయి. హీరో మోటోకార్ప్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌, ఐటీసీ, ఓఎన్‌జీసీ లాభాపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, దివిస్ ల్యాబ్‌, శ్రీసెమ్‌, యూపీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ 4 శాతానికి పైగా నష్టపోయాయి. శుక్రవారం సూచీలన్నీ నష్టపోయాయి. మెటల్‌, రియాల్టీ, ఐటీ సూచీలు 2-3 శాతం వరకు పతనం అయ్యాయి. పవర్‌ సూచీ మాత్రం 0.5 శాతం వరకు పెరిగింది.