Stock Market at 12 PM: భారత స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం కాస్త కొనుగోళ్ల సందడి కనిపించినా 12 గంటల తర్వాత అమ్మకాలు పెరిగాయి. పేటీఎం, కొటక్‌ బ్యాంక్‌, జీ యాక్టివ్‌గా ఉన్నాయి. బ్యాంకింగ్‌ రంగాన్ని మినహాయిస్తే మిగతా రంగాల సూచీలన్నీ కాస్త గ్రీన్‌లోనే ఉన్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 57,684 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,190 వద్ద నష్టాల్లోనే మొదలైంది. కొనుగోళ్లు పుంజుకోవడంతో 57,800 వరకు పుంజుకుంది. 57,827 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం 12 గంటలకు హఠాత్తుగా అమ్మకాలు మొదలవ్వడంతో  57,138 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. ప్రస్తుతం 233 పాయింట్ల నష్టంతో 57,451 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


బుధవారం 17,245 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,094 వద్ద ఓపెనైంది. 17,291 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత విక్రయాలు మొదలవ్వడంతో 17,091 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. సూచీ ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. ప్రస్తుతం 90 పాయింట్ల నష్టంతో 17,155 వద్ద కొనసాగుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ 35,633 వద్ద మొదలైంది. 35,957 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత 35,501 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. ప్రస్తుతం 630 పాయింట్ల నష్టంతో 35,516 వద్ద ట్రేడ్‌ అవుతోంది. రెండు తప్ప మిగతా బ్యాంకులన్నీ నష్టాల్లోనే ఉన్నాయి.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభపడగా 32 నష్టాల్లో ఉన్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, హిందాల్కో, కోల్‌ ఇండియా, అల్ట్రాటెక్‌ సెమ్‌ లాభాల్లో కొనసాగుతున్నాయి. కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటాన్‌, ఐచర్‌ మోటార్స్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి.