Sensex Today: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్... 162.78 పాయింట్లు దిగిన సెన్సెక్స్.. 45.75 పాయింట్లు పతనం

స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ తొలిసారిగా 56,000 మార్కు చేరుకుంది. ఇది నిఫ్టీ జీవితకాల గరిష్ట విలువ అని నిపుణులు చెబుతున్నారు.

ABP Desam Last Updated: 18 Aug 2021 04:04 PM

Background

స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. నేటి ఉదయం ఏకంగా 305.47 పాయింట్లు లాభపడింది. దీంతో సెన్సెక్స్ తొలిసారిగా 56,000 మార్కు చేరుకుంది. ఇది నిఫ్టీ జీవితకాల గరిష్ట విలువ. ప్రస్తుతం సెన్సెక్స్ విలువ 56,097.74గా ఉంది. అదే సమయంలో నిఫ్టీ కూడా...More

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..

స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. నేటి ఉదయం 305.47 పాయింట్లు  లాభపడి 56,097.74 పాయింట్లకు చేరిన సెన్సెక్స్.. బుధవారం సాయంత్రానికి 55,629.49 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఉదయం ప్రారంభమైన 55,792.27 పాయింట్లతో పోల్చితే 162.78 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు నిఫ్టీ సైతం 45.75 పాయింట్లు నష్టపోయి 16,568.85 పాయింట్లకు దిగొచ్చింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ మరియు ఫార్మాలు స్వల్ప లాభాలు నమోదుచేశాయి.