SEBI on Hindenburg Report: అమెరికన్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్, గౌతమ్ అదానీపై చేసిన ఆరోపణలన్నీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ద్వారా నిరాధారంగా తేలింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్‌పై స్టాక్స్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపించింది, కానీ కంపెనీకి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని సెబీ తెలిపింది.

సెబీ అదానీ గ్రూప్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది

గురువారం (సెప్టెంబర్ 18, 2025) నాడు సెబీ, అదానీ గ్రూప్‌కు క్లీన్ చిట్ ఇస్తూ తుది ఉత్తర్వుల్లో హిండెన్‌బర్గ్ కేసులో అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలు రుజువు కాలేదని పేర్కొంది. సెబీ ప్రకారం, నిబంధనలను ఉల్లంఘించలేదు, మార్కెట్ మానిప్యులేషన్ లేదా ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించిన ఆధారాలు కూడా లేవు. దీనితోపాటు గౌతమ్ అదానీ, అతని సోదరుడు రాజేష్ అదానీ, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, ఎడికార్ప్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్‌లకు పెద్ద ఊరట లభించింది.

అదానీ గ్రూప్‌పై చర్యలు రద్దు

న్యూస్ ఏజెన్సీ పిటిఐ నివేదిక ప్రకారం, సెబీ ఇలా పేర్కొంది, "రుణం వడ్డీతో సహా చెల్లించారు. ఎటువంటి డబ్బు తీసుకోలేదు, అందువల్ల ఎటువంటి మోసం లేదా అక్రమ వ్యాపారం జరగలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని, అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా అన్ని చర్యలు రద్దు చేశాం.

హిండెన్‌బర్గ్ జనవరి 2023లో అదానీ గ్రూప్, ఎడికార్ప్ ఎంటర్‌ప్రైజెస్, మైల్‌స్టోన్ ట్రేడ్‌లింక్స్,  రెహ్వర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే మూడు కంపెనీలను అదానీ గ్రూప్ కంపెనీల మధ్య డబ్బు పంపిణీకి ఒక మాధ్యమంగా ఉపయోగించిందని ఆరోపించింది. దీనివల్ల అదానీ సంబంధిత పార్టీ లావాదేవీల నిబంధనలను తప్పించుకోవడానికి సహాయపడిందని, పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు.

హిండెన్‌బర్గ్,  అదానీ గ్రూప్‌పై సెబీ విచారణ జరిపింది

అదానీ గ్రూప్ ఎల్లప్పుడూ హిండెన్‌బర్గ్ ఆరోపణలను ఖండించింది. ఈ ఆరోపణల తరువాత, సెబీ హిండెన్‌బర్గ్, అదానీ గ్రూప్ రెండింటిపైనా విచారణ ప్రారంభించింది. జూన్ 2024లో సెబీ హిండెన్‌బర్గ్‌కు నోటీసు పంపింది. ఈ నోటీసులో వారి పరిశోధన నివేదిక, షార్ట్-సెల్లింగ్ కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘన గురించి ప్రస్తావించారు. ఇందులో కంపెనీ పరిశోధన నివేదిక, షార్ట్-సెల్లింగ్ కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘన గురించి ఉంటకించారు. 

దీనికి ప్రతిస్పందనగా, హిండెన్‌బర్గ్ తమ నివేదిక బాగా పరిశోధించి, బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించినట్టు పేర్కొంది. వారి షార్ట్-సెల్లింగ్ కార్యకలాపాలు భారతదేశంలోని అన్ని చట్టపరమైన, నియంత్రణ ప్రక్రియలను అనుసరించాయని వారు వాదించారు.

సెబీ నివేదికపై గౌతమ్ అదానీ స్పందించారు. సత్యం గెలిచిందన్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లు జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. "సమగ్ర దర్యాప్తు తర్వాత, హిండెన్‌బర్గ్ వాదనలు నిరాధారమైనవని తేలింది తాము ఎప్పుడూ నమ్ముకునే విషయాన్ని సెబీ ధృవీకరించింది. పారదర్శకత, సమగ్రత ఎల్లప్పుడూ అదానీ గ్రూప్‌ను మరింత విస్తృత పరిచాయి. 

ఈ మోసపూరిత, ప్రేరేపిత నివేదిక కారణంగా డబ్బు కోల్పోయిన పెట్టుబడిదారుల బాధ మాకు తెలుసు. తప్పుడు కథనాలను వ్యాప్తి చేసిన వారు దేశానికి క్షమాపణ చెప్పాలి.

భారతదేశ సంస్థల పట్ల, భారతదేశ ప్రజల పట్ల, దేశ నిర్మాణం పట్ల మా నిబద్ధత ఉంది.

సత్యమేవ జయతే! జై హింద్! "అని ట్వీట్ చేశారు.